Tag Archives: sri ram chandra

తను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఓపెన్ అయిన శ్రీరామచంద్ర.. ఆ విషయంలో నిర్ణయం వారిదే..?

బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ గెలవడానికి శ్రీరామ చంద్ర , షణ్ముఖ్ జస్వంత్ తమ సొంత గేమ్ స్ట్రాటజీని కలిగి ఉన్నారు. వాళ్లిద్దరికి బయట కూడా అలానే అభిమానులు కలిగి ఉన్నారు. కానీ బిగ్ బాస్ షోలో వారి ప్రదర్శన విషయానికి వస్తే.. శ్రీరామ్.. షన్ను ఒక్కసారి మాత్రమే గొడవపడ్డారు.

తరువాత వారు ఎటువంటి వాగ్వాదాలకు దిగలేదు. ఇలా వాళ్లిద్దరు హౌస్ లో మంచి స్నేహితులుగా సాగారు. సిరితో షణ్ముఖ్ టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్న సమయంలో శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్ తో కనెక్ట్ కాలేకపోయారు. ఇక వీరిద్దరు కలిసి స్నేహితులుగా ముందుకు సాగితే బిగ్ బాస్ టైటిల్ ఫలితం వేరే విధంగా ఉండేదని ఒక వర్గం ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.

ఇక శ్రీరామచంద్ర సెకండ్ రన్నరప్ కు హౌస్ నుంచి వెనుదిరిగాడు. ఇండియన్ ఐడల్ 5 గెలుచుకున్న శ్రీరామచంద్ర .. బిగ్ బాస్ 5 కూడా గెలుచుకుంటానని.. 5 అనే అంకె సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకున్నానని.. కానీ అది జరగలేదని చెప్పుకొచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత అతడు వివిధ ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఇక ఓ ఇంటర్వ్యూలో ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తన పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడు.. తను పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో మొత్తం బాధ్యత తన తల్లిదండ్రులదే అని చెప్పుకొచ్చాడు. గత మూడు సంవత్సరాల నుంచి తన పెళ్లి గురించి ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారని చెప్పాడు.

అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలి.. ఇంట్లో వాళ్తతో ఎక్కువగా కలిసి పోయే గుణం ఉండాలి.. అంతకంటే ముఖ్యంగా తన ఆలోచనలకు తగ్గట్టూ ఉండాలని అతడు.. తన కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందన్నాడు.

శ్రీరామ్ ఎలిమినేట్ సమయంలో.. భావోద్వేగానికి గురైన హమీదా..స్టేజ్ పై పాట పాడుతున్నంత సేపు..!

తెలుగులో ప్రసారం అయిన అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్5 ముగిసింది. విన్నర్ గా సన్నీ, రన్నర్ గా షణ్ముక్ నిలిచారు. మొదటి నుంచి అనుకున్నట్లే సన్నీ విన్నర్ గా నిలిచాడు. ఇక విన్నర్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఆమె తల్లి కళావతి కళ్లల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఎంతో సంతోషంతో.. ఆనందంతో .. భావోద్వేగాల నడుము ఫైనల్ ముగిసింది. ఇక ఈ ఫినాలే లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉన్న సిరిని మొదట ఇంటి నుంచి బయటకు వచ్చింది. తర్వాత టాప్ 4 కంటెస్టెంట్ మానస్ బయటకు వచ్చాడు. ఇక ఫినాలేలో మిగిలింది ముగ్గురు. దీనిలో ఒక కంటెస్టెంట్ ను ఇంటి నుంచి బయటకు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లాడు నాగ చైతన్య.

సీజన్ 4 లో సోహెల్ డబ్బుకు ఆశపడి.. హౌజ్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఇదే విధంగా హౌస్ లో కూడా వారి ముగ్గురిలో ఒకరిని టెంప్ట్ చేసేందుకు సూట్ కేస్ తీసుకొచ్చాడు నాగచైతన్య. కానీ ఎవరూ ఆ సూట్ కేస్ ను తీసుకోలేదు. తర్వాత బయట నుంచి నాగార్జున శ్రీరామచంద్ర ఎలిమినేట్ అని ప్రకటిస్తాడు. అతడిని తీసుకొని నాగ చైతన్య వేదికపై తీసుకొస్తాడు.

ఆ సూట్ కేసులో రూ.20 లక్షలు ఉన్నట్లు వెల్లడించాడు నాగచైతన్య. శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. తెలుగు అభిమానులకు.. ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఈ షోలో అడుగుపెట్టానని చెప్పాడు. ఇప్పుడు ఆ కల నెరవేరిందని చెప్పాడు. రేపటి నుంచి నాలో మరో శ్రీరామ్ చంద్రను చూస్తారని నాగార్జునకు చెబుతాడు శ్రీరామ్.

ఇక వెళ్లిపోయే ముందు నానీ సినిమాలోని ‘పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మా’ అంటూ పాట పాడాడు. ఈ పాట పాడుతున్నంత సేపు శ్రీరామ్ తల్లితో పాటు.. ఎక్స్ హౌస్ మేట్ హమీదా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక చివరకు వాళ్ల అమ్మకు హగ్ ఇచ్చేసి.. హమీదాకు కూడా హగ్ ఇచ్చి.. చివరకు హమీదా పక్కన కూర్చుంటాడు శ్రీరామ చంద్ర.

రన్నర్ గా శ్రీరామచంద్ర..! విన్నర్ గా సన్నీ..? వార్తలో నిజమెంత..?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. 19 మంది ఎన్నో ఆశలతో బిగ్బాస్ లోకి అడుగుపెట్టగా.. చివరకు 5గురు మిగిలారు. దీనిలో నుంచి ఇప్పటికే సిరి, మానస్ బయటకు వచ్చారనే సమాచారం తెలుస్తోంది. ఇక మిగిలిన ముగ్గురు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు నడవనుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా షణ్ముఖ్ టైటిల్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకున్నాడు. నాలుగు వారాల తర్వాత .. సమీకరణాలు అన్నీ తారుమారు అయ్యాయి. ఒక్కసారిగా సన్నీ మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఎవరి అంచనాలకు అందకుండా.. ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది కూడా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది.

ఇక హౌస్ లో ఉన్న శ్రీరామచంద్ర విషయానికి వస్తే.. తెలుగులో తన పాపులారిటీని పెంచుకోవాడానికి హౌస్ లోకి అడుగుపెట్టారు. అతడు అనుకున్నట్లుగానే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. విన్నర్ గా సన్నీని అనౌన్స్ చేయగా.. రన్నర్ గా శ్రీరామచంద్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు రూ.50 లక్షల ప్రూజ్ మనీ తో పాటు ఒక బైక్ ను మరియు రూ.25 లక్షలు విలువచేసే ఓ ప్లాట్ ను కూడా ఇవ్వనున్నట్లు తెలిసిందే. ఫైనల్ లో మిగిలిన వీళ్ల ముగ్గరికి మనీ ఆఫర్ చేస్తాడనేది కూడా వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ శ్రీ రామచంద్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి.. అతనికి ఓటు వేయకండి అంటూ..!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా సింగర్ శ్రీరామచంద్ర హౌస్ లోకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మొదటి నుంచి ఎంతో చాకచక్యంగా టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచారు. టైటిల్ రేసులో కూడా శ్రీరామచంద్ర పేరు పెద్ద ఎత్తున వినపడుతోంది.ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు నువ్వానేనా అని పోటీ పడుతున్న నేపథ్యంలో కొందరు సినీ సెలబ్రిటీలు సైతం హౌస్లో ఉన్న వారి మద్దతు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే సింగర్ శ్రీరామచంద్ర గురించి సంచలన తార శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరూ కూడా శ్రీ రామచంద్రకు ఓటు వేయకండి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఓటు వేసి గెలిపించటం వల్ల సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ ఇలాంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపించకండి అంటూ శ్రీ రామ్ చంద్ర గురించి తెలిపింది.

శ్రీ రెడ్డి శ్రీ రామచంద్రను తిడుతూ షణ్ముఖ్ జస్వంత్ కు సపోర్ట్ చేస్తూ అతనిని గెలిపించండి అంటూ మద్దతు తెలిపింది.శ్రీ రామచంద్ర ఇండియన్ ఐడిల్ టైటిల్ గెలిచాడు కదా బిగ్ బాస్ టైటిల్ కూడా ఇద్దామని అతనికి ఇవ్వకండి అతను రియాలిటీ లేని వ్యక్తి అంటూ గతంలో శ్రీరామచంద్ర వాట్స్అప్ చాట్ చేసిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో అవన్నీ నిజమేనని ఈమె తెలిపారు.

ఇండియన్ ఐడల్ అడ్డంపెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్ చేయడం ఏవేవో చేయాలని కుసంస్కారం అతనిది.ఇన్ని పాపాలు చేశాడు కనుక ఇండియన్ ఐడల్ తన ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు అంటూ తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు ఓటు వేయొద్దని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు.

హౌస్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ.. భావోద్వేగాల నడుమ సందడే సందడి..!

తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. ఇప్పటికే 12 వ వారం కంప్లీట్ కాబోతోంది. 80 రోజులకు పైగా హౌస్ లో ఉన్న వాళ్లకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ చేశారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కాజల్ భర్త, ఆమె కూతురును హౌస్ లోకి పంపించారు. దీంతో కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాజల్ కూతురు అయితే మరీ ఎక్కువ ఆనందం వ్యక్తం చేసింది.

తాను ఇందులోకి వచ్చి.. నిన్ను కలుసుకుంటానని అనుకోలేదు మమ్మీ అంటూ.. హగ్ చేసుకుంటూ చెబుతుంది. తల్లిని చూడగానే కాజల్ కూతురు ఎమోషనల్ అయ్యింది. ఇక హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరినీ కాజల్ భర్త పలకరించాడు. శ్రీరామ చంద్ర మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే నీకు కోపం వస్తుందా అంటూ కాజల్ కూతురును అడగ్గా.. అవును అంటూ సమాధానం ఇస్తుంది.

ఎక్కువగా యానీ మాస్టర్ అంటే ఎక్కువగా కోపం వచ్చేదని.. ఆమె ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందంటూ చెప్పింది కాజల్ కూతురు. ఇక ఈ రోజు శ్రీరామ చంద్రకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ల సిస్టర్ కనిపించారు. మానస్ కోసం తన తల్లి వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేయనున్నారు. ఇక ఇదంతా ఇలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 5 చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ జశ్వంత్ ఎన్నికయ్యాడు.

రవి, షణ్ముఖ్ లాస్ట్ వరకు ఉండగా ఇద్దరిలో హౌస్ సభ్యులు ఎక్కవుగా షణ్ముఖ్ ను సపోర్ట్ చేయడంతో అతడు కెప్టెన్ అయ్యాడు. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా.. హౌస్ ఓ ఉన్న కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. చివరగా.. హౌస్ అంతా భావోద్వేగంతో కూడిన.. ఆనంద భాష్పాల మధ్య నడుస్తోంది.