Tag Archives: sridevi

శ్రీదేవిని ఊహించుకొని దాదాపు 3 వేల సార్లు ఆ పని చేశాను: ఆర్జీవీ

రామ్‌ గోపాల్‌ వర్మ పరిచయం అవసరం లేని పేరు.. సమాజంలో జరిగే అన్ని విషయాలపై విభిన్నమైన కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. ముఖ్యంగా ఆర్జీవీ చేసే కామెంట్లు ఎక్కువ శాతం మహిళలపై ఉండటం.. అవి వైరల్ అవటంతో పాటు, ఎక్కువగా వివాదాలకు దారి తీస్తుంటాయి.

రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో, ఎవరిపై కామెంట్స్ చేస్తాడో తెలియదు. అయితే ఈ వివాదాస్పద దర్శకుడి ఇంటర్వ్యూ చేసిన ప్రతి మహిళ యాంకర్ ఫేమస్ అవ్వటమే కారణంగా ఆర్జీవీ ఇంటర్వ్యూ కోసం లేడి యాంకర్లు క్యూ కడుతుంటారు.

ఉదాహరణకు బిగ్‌బాస్‌ ఫేం అరియానా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వెంటనే ఆ వీడియో వైరల్ అవటం, తనకి బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో అవకాశం రావటం.. ఇవన్ని రామ్‌ గోపాల్‌ వర్మ కామెంట్స్ కి ఉన్న క్రేజ్. అరియాన బాటలో మరో బిగ్‌బాస్‌ భామ అషు రెడ్డి కూడా వర్మతో బోల్డ్‌ ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో విడుదల అయింది.

ఈ ఇంటర్వ్యూలో వర్మను ఓ ప్రశ్న అడిగింది. అందేంటంటే.. మీకు శ్రీదేవి అంటె ఇష్టం కదా.. ఎప్పుడైనా ఆమెను ఊహించుకొని మాస్టర్బేట్ చేశారా అని అడిగింది. అవును ఎన్నోసార్లు ఆ పని చేశాను.. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు దాదాపు 3 వేల సార్లు చేసి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఈ విషయం రామ్ గోపాల్ వర్మ స్వయంగా శ్రీదేవికి కూడా చెప్పినట్లు సమాధానం ఇచ్చాడు. మొదట ఆమె ఇబ్బందిగా ఫీల్ అయినట్లు.. తర్వాత నవ్వినట్లు చెప్పాడు.

సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదం జరిగిందనే సంగతి మీకు తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలను తెరకెక్కించేటప్పుడు కొంత వరకు ప్రమాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఏవైనా కష్టతరమైన సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు హీరో హీరోయిన్లు కాకుండా వారికి డూప్ లను తీసుకొని చిత్రాన్ని తెరకెక్కిస్తారు. అయితే ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ప్రమాదాలు జరగడం కొన్నిసార్లు ఆ ప్రమాదాలలో మరణించడం కూడా జరుగుతుంటాయి.

ఈ క్రమంలోనే ఒకప్పుడు కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి జంటగా నటించినటువంటి చిత్రం అడవి సింహాలు. వైజయంతి బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఒకరోజు షూటింగ్ లో భాగంగా ఈ నలుగురిపై వైజాగ్ బీచ్ లో ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాట చిత్రీకరణ జరిగే సమయంలో అనుకోని ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఒకరు మరణించారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వైజాగ్ బీచ్ లో ఈ నలుగురిపై పిల్ల నచ్చింది అనే పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం వైజాగ్ బీచ్ కి వెళ్లారు.ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి బెలూన్స్ అన్నింటికీ గ్యాస్ నింపుతూ ఉన్నారు.అయితే ఆ వ్యక్తి అలా నింపడంతో కొందరు పిల్లలు అతనిని ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిలబడ్డారు. ఆ సమయంలోనే కృష్ణంరాజు జయప్రద అక్కడికి వెళ్లగా వారి మాటలు విని చాలా మంది అక్కడికి చేరుకున్నారు.

ఈ విధంగా బెలూన్స్ లో గ్యాస్ నింపుతున్న సమయం లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి తల తెగిపడింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు భయంతో వణికిపోయి వెళ్లి ఒక్కసారిగా సినీనటుల దగ్గరికి పారిపోవడంతో పెద్ద పెనుప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేదంటే మరింత ప్రాణనష్టం జరిగేదని ఓ సందర్భంలో ఈ చిత్రంలో జరిగిన ప్రమాదం గురించి బయట పెట్టారు. ఏది ఏమైనప్పటికీ సినిమా సెట్ లో ఇలా జరగడం అప్పట్లో అందరినీ కలిచివేసిందని సమాచారం.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన .. సెలబ్రిటీలు వీళ్లే!

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత గర్భవతి కావడం పిల్లల్ని కనడం ఒక ఆచారంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తోంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ ఆచారాలను బ్రేక్ చేస్తూ ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లికి ముందే కొందరు గర్భం దాల్చగా మరికొందరు పిల్లల్ని కన్న తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పిల్లల్ని కన్నారు.

అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి నుంచి మొదలుకొని క్రికెటర్ హార్దిక్ పాండే గర్ల్ ఫ్రెండ్ నటాషా వరకు కొందరు సెలబ్రిటీలు పెళ్లికి ముందే గర్భం దాల్చారు. మరి కొందరు పిల్లల్ని కూడా కన్నారు. మరి పెళ్లికి ముందే గర్భం దాల్చి, పిల్లల్ని కన్న సెలబ్రిటీలు ఎవరు ఇక్కడ తెలుసుకుందాం..

శ్రీదేవి బోనీ కపూర్ ను పెళ్లి చేసుకునే సమయంలో 7 నెలల గర్భవతి. పెళ్లి చేసుకున్న మూడు నెలలకే జాన్వికపూర్ జన్మించారు.

క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న నటాషా స్టాన్‌కోవిచ్ పెళ్లికి ముందే గర్భం దాల్చారు.

నేహ దుపియా: మాజీ మిస్ ఇండియాగా పేరు సంపాదించిన నేహా.. అంగద్ దుపియాను పెళ్లి చేసుకునేకంటే ముందే వీరిద్దరు రిలేషన్ షిప్‌లో ఉండి పెళ్లి సమయానికి పండంటి కూతురుకు జన్మనిచ్చారు.

అమృతా అరోరా: షకీల్ లడక్‌తో పెళ్లికి ముందే సహజీవనం చేస్తున్న అమృత గర్భవతి అయింది. ఈమె గర్భవతి అని తెలిసిన కొన్ని నెలలకే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

అమీ జాక్సన్: అమీ జాక్సన్ బాయ్ ఫ్రెండ్ జార్జ్‌తో నిశ్చితార్థం అయిన వెంటనే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం అమీజాక్సన్ ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

నీనా గుప్తా: వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయ్యారు. అయితే రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోయినప్పటికీ ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

సారిక: కమల్ హాసన్, సారికకు పెళ్లి కాకుండానే శ్రుతిహాసన్ జన్మించారు.శృతిహాసన్ పుట్టిన రెండు సంవత్సరాలకు వీరిద్దరి పెళ్లి జరిగింది.

రేణు దేశాయ్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెళ్లి కాకుండానే పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేశారు. అకీరానందన్ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.

పెళ్లిపై కలలుకంటున్న జాన్వికపూర్.. తన పెళ్లి అక్కడ జరగాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేయించుకున్న అలనాటి తార అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి మరణించినప్పటికీ ఇప్పటికీ ఆమెపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు.ఇక శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జాన్వికపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతిపోగొడుతుంటారు.ఈ క్రమంలోనే జాన్వికపూర్ ఓ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తన పెళ్లి ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా కేవలం రెండు రోజులలో సాంప్రదాయ పద్ధతిలో జరిగిపోవాలని, తన పెళ్లి తిరుపతిలో చేసుకోవాలనే కోరిక ఉందని తెలిపారు.మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో తన తల్లి ఉన్న ఇంటిలో జరగాలని పెళ్లి మాత్రం తిరుపతిలోనే చేసుకుంటానని తెలిపారు.

ఈ విధంగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన తల్లి పై ఉన్న అభిమానానికి గుర్తుగా తను పుట్టి పెరిగిన ప్రాంతాలలోనే తన పెళ్లి చేసుకోవాలని భావిస్తూ తన తల్లి పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక తనకు కాబోయే వరుడు బాగా తెలివైనవాడు అయితే చాలని, ఈ సందర్భంగా తనకు కాబోయే వరుడు ఏవిధంగా ఉండాలో కూడా జాన్వి కపూర్ తెలియజేశారు.

మెగా హీరో రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..??

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.. ఇక ఇదిలా ఉంటె ఇండ్రస్టీ లో అందరితో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసే రామ్ చరణ్ మొదటి క్రష్ ఎవరనేది ఇప్పుడు బయటికి వచ్చింది. ఆమె ఎవరో కాదు అతిలోకసుందరిగా పేరు సంపాదించిన శ్రీదేవి.

శ్రీదేవి అంటే రామ్ చరణ్ కి ఎంతో అభిమానం అని తెలిసింది. అయితే రాంచరణ్ తో పాటు మరో నటుడైన జూనియర్ ఎన్‌టిఆర్ కి కూడా శ్రీదేవి అంటే ఎంతో అభిమానం అని ఆమె చూస్తే అన్నీ మర్చిపోతారని తెలిసివచ్చింది. స్నేహితులైన వీరిద్దరు ఒకే హీరోయిన్ అయినా శ్రీదేవిని అభిమానించడం విశేషం. ఇక వీరిద్దరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇదే సంవత్సరంలో విడుదల కావలసిన సినిమా కరోనా కారణంగా కొంచం వాయిదా పడేలా కనిపిస్తుంది.

ఇక మిగతా నటుల యొక్క ఫస్ట్ క్రష్ ఎవరో చూస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఐశ్వర్య రాయ్ ఫస్ట్ క్రష్ కాగా, మరో నటుడు ప్రభాస్ కు తాను చిన్నపుడు చదివిన స్కూల్ టీచర్ ఫస్ట్ క్రష్ అని తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక హాలీవుడ్ నటి తన ఫస్ట్ క్రష్ అని చెప్పుకొచ్చారు. అలాగే టాలీవుడ్ కి చెందిన కొందరు హీరోయిన్స్ తమ ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పడం జరిగింది.

మొదటిగా చూస్తే పూజ హెగ్డే ఈమె తన ఫస్ట్ క్రష్ హృతిక్ రోషన్ అని తెలుపగా, మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రణ్ వీర్ సింగ్ తన మొదటి క్రష్ అని తెలిపింది. అలాగే మరో నటి ప్రణీత కూడా తన స్కూల్ లో చదివిన అబ్బాయే తన మొదటి క్రష్ అని ఒక సందర్భం లో చెప్పుకొచ్చింది..ఇక ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న చెర్రీ.. నెక్స్ట్ శంకర్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.!!

శ్రీదేవి పెట్టిన కండిషన్స్ ని తట్టుకోలేక ఆ సినిమాలో హీరోయిన్ ని మార్చి చిరంజీవి ఎంత పెద్ద హిట్ కొట్టాడో తెలుసా..??

తెలుగు ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో హీరోగా అత్యున్నత స్థాయికి ఎదిగి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి..దాదాపు150 కి పైగా చిత్రాల్లో నటించిన చిరూ కి.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి… అలాంటి సినిమాల్లో ఒకటి కొండవీటి దొంగ చిత్రం. ఈ సినిమా పేరు వింటే మెగా ఫాన్స్ ఎంతో సంతోష పడతారు.

ఆరోజుల్లో యువకులకు ఈ సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉండేది. తెలుగు పరిశ్రమను ఓ ఊపు ఊపడంతో పాటు తెలుగు సినిమా మీద ఇండియన్ సినిమా ఫోకస్ చేసేలా చేసింది.కొండవీటి దొంగ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. చిరంజీవి వరుస అపజయాలతో బాధపడుతున్న రోజుల్లో ఈ సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం మీద త్రివిక్రమరావు నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించారు.

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే రాశారు.ఈ సినిమాలో హీరోయిన్ పైనా చాలా డిస్కర్షన్ జరిగింది. మొదట శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు. ఆమె ఎక్కువ కండీషన్లు పెట్టడంతో విజయశాంతిని సంప్రదించారు. తను ఓకే చెప్పడంతో ఆమె పేరును ఓకే చేశారు. విలన్ రోల్ కోసం అమ్రిష్ పురిని తీసుకున్నారు. ఆరోజుల్లో తొలి 70 ఎంఎం సినిమా కావడంతో చాలా జాగ్రత్తగా సినిమాను రూపొందించారు.ఇక ఈ సినిమాకు ఇళయ రాజా మ్యూజిక్ ఇచ్చారు. చిరు కెరీర్ లోనే ఈ సినిమా సంగీతం బెస్ట్ గా నిలిచింది.

సినిమాలోని అన్ని పాటలు మంచి విజయాన్ని సాధించాయి. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో ప్రతి ఇంట్లో ఈ సినిమా పాటలే వినిపించాయి. ఈ సినిమా విజయాన్ని చూసి అగ్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయారు అంటే కొండవీటి దొంగ పవరేంటో తెలుసుకోవచ్చు. ఇక నాగబాబు చిరంజీవి మధ్య ఉన్న ఫైట్. లాస్ట్ లో అమ్రీష్ పూరి, చిరంజీవి మధ్య ఉన్న ట్రైన్ ఫైట్ ఒక సంచలనం అయ్యాయి.ఈ సినిమా తొలి వారంలో రూ. 74 లక్షల షేర్ సాధించింది. అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు.దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది..!!