తెలుగు ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో హీరోగా అత్యున్నత స్థాయికి ఎదిగి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి..దాదాపు150 కి పైగా చిత్రాల్లో నటించిన చిరూ కి.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి… అలాంటి సినిమాల్లో ఒకటి కొండవీటి దొంగ చిత్రం. ఈ సినిమా పేరు వింటే మెగా ఫాన్స్ ఎంతో సంతోష పడతారు.
ఆరోజుల్లో యువకులకు ఈ సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉండేది. తెలుగు పరిశ్రమను ఓ ఊపు ఊపడంతో పాటు తెలుగు సినిమా మీద ఇండియన్ సినిమా ఫోకస్ చేసేలా చేసింది.కొండవీటి దొంగ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. చిరంజీవి వరుస అపజయాలతో బాధపడుతున్న రోజుల్లో ఈ సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం మీద త్రివిక్రమరావు నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించారు.
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే రాశారు.ఈ సినిమాలో హీరోయిన్ పైనా చాలా డిస్కర్షన్ జరిగింది. మొదట శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు. ఆమె ఎక్కువ కండీషన్లు పెట్టడంతో విజయశాంతిని సంప్రదించారు. తను ఓకే చెప్పడంతో ఆమె పేరును ఓకే చేశారు. విలన్ రోల్ కోసం అమ్రిష్ పురిని తీసుకున్నారు. ఆరోజుల్లో తొలి 70 ఎంఎం సినిమా కావడంతో చాలా జాగ్రత్తగా సినిమాను రూపొందించారు.ఇక ఈ సినిమాకు ఇళయ రాజా మ్యూజిక్ ఇచ్చారు. చిరు కెరీర్ లోనే ఈ సినిమా సంగీతం బెస్ట్ గా నిలిచింది.
సినిమాలోని అన్ని పాటలు మంచి విజయాన్ని సాధించాయి. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో ప్రతి ఇంట్లో ఈ సినిమా పాటలే వినిపించాయి. ఈ సినిమా విజయాన్ని చూసి అగ్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయారు అంటే కొండవీటి దొంగ పవరేంటో తెలుసుకోవచ్చు. ఇక నాగబాబు చిరంజీవి మధ్య ఉన్న ఫైట్. లాస్ట్ లో అమ్రీష్ పూరి, చిరంజీవి మధ్య ఉన్న ట్రైన్ ఫైట్ ఒక సంచలనం అయ్యాయి.ఈ సినిమా తొలి వారంలో రూ. 74 లక్షల షేర్ సాధించింది. అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు.దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది..!!
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…