ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎందుకూ పనికి రాని వాడిలా చూస్తారు జనాలు..అంతెందుకు ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ లేకపోతే అసలు పెళ్లి చేసుకోడానికి పిల్లను కూడా ఇవ్వట్లేదు.. అది ప్రభుత్వ జాబ్కు ఉన్న డిమాండ్. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడాలి.
అలాంటిది తనకు నచ్చిన రంగం కోసం కష్టపడి సాధించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు ఓ జబర్దస్త్ కమెడియన్. అతను ఎవరో కాదు అప్పట్లో పటాస్.. ఇప్పుడు జబర్దస్త్ షోలో పంచ్లు పేలుస్తూ ఫన్ ఇస్తున్న నూకరాజు.పటాస్ కామెడీ షోతో నూకరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే పటాస్ తర్వాత జబర్దస్త్లో కమెడియన్గా అవకాశం పొందాడు. అయితే పటాస్ కంటే ముందు జీ తెలుగులో ఒక కామెడీ షో కూడా చేశాడు నూకరాజు.
ప్రస్తుతం జిగేల్ జీవన్ టీంలో చేస్తూ పంచ్లు పేలుస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పర్సనల్ విషయాలు చెబుతూనే.. యాక్టింగ్ ఫీల్డ్లోకి రాకముందు ఏం చేసేవాడో చెప్పుకొచ్చాడు. పటాస్ షోకు రాకముందు విజయవాడ పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్ అవకాశాల కోసం ట్రై చేశాడు. అలాంటి సమయంలో జీ తెలుగులో ఒక కామెడీ షోలో అవకాశం వచ్చింది.
ఉద్యోగం చేస్తూ కామెడీ షోలో నటించడం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి.. నచ్చిన రంగంవైపే అడుగులు వేశా. అని ఆ ఇంటర్వ్యూలో నూకరాజు చెప్పుకొచ్చాడు. నూకరాజు మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా చాలా మంది తమకు వచ్చిన బంగారం లాంటి అవకాశాలను వదులుకొని నచ్చిన సినిమా రంగం కోసం వచ్చి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…