Movie News

అడవి శేష్ ‘మేజర్’ కోసం ఏకంగా ఆరు భారీ సెట్స్.. వాటి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..??

టాలీవుడ్ లో విభిన్న కథా చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్.. ఇటీవల గూఢచారి117 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి.. ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు హీరో అడివి శేష్‌. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని భాషలలో మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా మేజర్ విడుదలకు సిద్ధమవుతోంది.నిజ ఘటనల ఆధారంగా చేసుకుని డైరెక్టర్ శశికిరణ్ తిక్క అండ్ టీమ్ ఈ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నారు. అందుకు తగినట్లు భారీ సెట్స్‌ను వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు. మహానటి వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన అవినాష్ కొల్ల, మేజర్ సినిమాలోని సన్నివేశాలను రియలిస్టిక్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.అందుకోసం ఆయన ఆరు భారీ సెట్స్ వేశారు. అందులో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్.. ఎన్ఎస్‌జీ కమాండో సెట్‌లను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేశారు. ఇక ఈ సినిమాకు వేసిన భారీ సెట్స్‌లో తాజ్ హోటల్‌ ప్యాలెస్ సెట్ హైలెట్ అని చెప్పుకుంటున్నారు.

2008లో జరిగిన టెర్రర్ ఎటాక్ తాజ్ హోటల్‌లోనే జరిగింది. ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ప్రేక్షకులకు రియల్ లొకేషన్ ఫీలింగ్‌ కలిగించడానికి రియల్ హోటల్ ఎలా ఉందో అలాంటి సెట్‌నే వేశామని తాజాగా ఆర్ట్ డైరెక్టర్‌ అవినాష్ కొల్ల తెలిపారు. వాస్తవానికి ముంబైలోని తాజ్ హోటల్‌లోనే చిత్రీకరణ జరపాలని యూనిట్ అనుకున్నప్పటికీ వారికి అనుమతులు లభించకపోవడంతో.. సెట్‌ను వేయక తప్పలేదు. నాలుగైదు రోజుల పాటు చిత్ర యూనిట్ తాజ్ హోటల్ ఆర్కిటెక్చర్‌ను పరిశీలించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సునిశితంగా పరిశీలించడమే కాకుండా, సెట్‌ను వేయడానికి ఎంతో రీసెర్చ్ చేశామని.. ఐదు వందల మంది దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్‌ను నిర్మించామని అవినాష్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ”మేజర్ సినిమా కోసం ఆరు భారీ సెట్స్ వేశాం. ప్రతి సెట్ వేసే క్రమంలో మా టీమ్ ఎంతో రీసెర్చ్ చేసుకుని, డిజైన్స్ తయారు చేసుకుని ముందుకెళ్లాం. ముఖ్యంగా తాజ్ పాలెస్ సెట్ వేయడానికి బాగా కష్టపడ్డాం. అడివి శేష్‌, స్టోరిని నెరేట్ చేసేటప్పుడు తాజ్ హోటల్ ప్రాధాన్యతను వివరించారు. సినిమాలో అదొక సెట్ ప్రాపర్టీలాగా కాకుండా క్యారెక్టర్‌లా ఊహించుకోవాలని చెప్పాడు. శేష్‌, చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకుని, రియల్ తాజ్ ప్యాలెస్‌లా మా సెట్‌ను వేశాం. అంతేకాదు 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్‌ను ఫైబర్‌, ఉడ్‌, ఐరన్ ఉపయోగించి తయారు చేశాం అని అన్నారు..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

55 minutes ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

1 hour ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

1 hour ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

17 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

17 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

17 hours ago