Movie News

ఆవిరి పడితే కరోనా తగ్గిపోతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను కరోనా వైరస్ లక్షణాలు భావించేవారు. అయితే ప్రస్తుతం వైరస్ లక్షణాలలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

దగ్గు, జలబు, జ్వరం మాత్రమే కాకుండా రుచి తెలియకపోవటం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం కరోనా లక్షణాలు.చాలామంది నీటి ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్ చనిపోతుంది, వ్యాధి తగ్గుతుందని భావిస్తుంటారు. నిజానికి నీటి ఆవిరి పట్టడం ద్వారా వైరస్ చనిపోదని నిపుణులు తెలియజేస్తున్నారు.

యు ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నీటి ఆవిరి పట్టడం వంటి ఇంటి చిట్కాల ద్వారా వైరస్ ఏమాత్రం తగ్గదని తెలియజేశారు. ఆవిరి పట్టడం వల్ల దగ్గు జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే తగ్గుతాయి. ఆవిరి పట్టడం ద్వారా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం మాత్రమే కలుగుతుంది.

ఆయుర్వేద వైద్యులు మాత్రం వేడి నీళ్లు తాగుతూ, ఆవిరి పట్టుకోవడం ఎంతో మంచిదని చెబుతున్నారు. నీళ్లు తాగడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉండవు. అదేవిధంగా బయటకు వెళుతూ వచ్చేవారు అప్పుడప్పుడు నీటి ఆవిరి పట్టడం వల్ల మంచిది అంటున్నారు. అదేవిధంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం కోసం సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలి రోగనిరోధకశక్తిని పెంచుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఉదయం లేదా సాయంత్రం?.. సరైన వర్కౌట్ టైమ్ ఎంచుకోవడం ఇలా!

వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…

6 minutes ago

ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…

14 minutes ago

ఫ్రెష్ మటన్ ఎలా గుర్తించాలి?.. తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్!

వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…

21 minutes ago

ట్రోలింగ్‌ను జయించి టాప్ మార్కులు.. ప్రాచీ నిగమ్ స్ఫూర్తిదాయక గాథ

ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాచి…

1 hour ago

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. వ్యూహమా? సంకోచమా?

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…

1 hour ago

లక్నో జట్టులో కలకలం.. పంత్ కెప్టెన్సీపై జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…

1 hour ago