సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలను తెరకెక్కించేటప్పుడు కొంత వరకు ప్రమాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఏవైనా కష్టతరమైన సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు హీరో హీరోయిన్లు కాకుండా వారికి డూప్ లను తీసుకొని చిత్రాన్ని తెరకెక్కిస్తారు. అయితే ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ప్రమాదాలు జరగడం కొన్నిసార్లు ఆ ప్రమాదాలలో మరణించడం కూడా జరుగుతుంటాయి.
ఈ క్రమంలోనే ఒకప్పుడు కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి జంటగా నటించినటువంటి చిత్రం అడవి సింహాలు. వైజయంతి బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఒకరోజు షూటింగ్ లో భాగంగా ఈ నలుగురిపై వైజాగ్ బీచ్ లో ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాట చిత్రీకరణ జరిగే సమయంలో అనుకోని ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఒకరు మరణించారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వైజాగ్ బీచ్ లో ఈ నలుగురిపై పిల్ల నచ్చింది అనే పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం వైజాగ్ బీచ్ కి వెళ్లారు.ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి బెలూన్స్ అన్నింటికీ గ్యాస్ నింపుతూ ఉన్నారు.అయితే ఆ వ్యక్తి అలా నింపడంతో కొందరు పిల్లలు అతనిని ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిలబడ్డారు. ఆ సమయంలోనే కృష్ణంరాజు జయప్రద అక్కడికి వెళ్లగా వారి మాటలు విని చాలా మంది అక్కడికి చేరుకున్నారు.
ఈ విధంగా బెలూన్స్ లో గ్యాస్ నింపుతున్న సమయం లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి తల తెగిపడింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు భయంతో వణికిపోయి వెళ్లి ఒక్కసారిగా సినీనటుల దగ్గరికి పారిపోవడంతో పెద్ద పెనుప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేదంటే మరింత ప్రాణనష్టం జరిగేదని ఓ సందర్భంలో ఈ చిత్రంలో జరిగిన ప్రమాదం గురించి బయట పెట్టారు. ఏది ఏమైనప్పటికీ సినిమా సెట్ లో ఇలా జరగడం అప్పట్లో అందరినీ కలిచివేసిందని సమాచారం.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…