Tag Archives: Srilekha

పోసానికి విపరీతమైన కోపం..! ఫోన్ లిఫ్ట్ చేయడం రెండు సెకండ్లు లేట్ అయినా.. ఎం.ఎం. శ్రీలేఖ..

టాలీవుడ్ లో ఏకైక లేడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ లేఖ‌. ఎం.ఎం. కీర‌ణ‌వాణి చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలేఖ ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాల‌కు సంగీతం అందించారు. ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని హిందీ, తమిళ, మళయాలం, కన్నం వంటి భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ హీరోగా తాజ్ మహల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీనిని డా. డి. రామానాయుడు నిర్మించారు. దీనిలో సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ పనిచేశారు. ఆ తర్వాత శివయ్య, ప్రేయసి రావే.. ఆపరేషన్ దుర్యోదన వంటి 70కి పైగా సినిమాలకు బాణీలను అందించారు శ్రీలేఖ. అయితే ఆమె తాజాగా పోసానీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పోసానీ కృష్ణ మురళికి కోపం ఎక్కువగా ఉంటుందని.. తొందర్లో టపటపా మాట్లాడేసి.. తర్వాత కూల్ అవుతారని చెప్పుకొచ్చారు. ఒక సాంగ్ కంపోజ్ చేయడం లేట్ అయిందంటే.. ఎందుకు.. ఏమైందటూ ఆవేశ పడతారాని.. తెలిపారు. కాల్ చేసిన రెండో రింగ్ కు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే.. అతడికి కోపం విపరీతంగా వస్తుందని శ్రీలేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అతడు మంచి విజన్ ఉన్న దర్శకుడు అని.. ఎలాంటి టెన్షన్ లేని సమయంలో ‘రాజా’ అంటూ సంబోధిస్తారని చెప్పారు. కోపం వచ్చినా కేవలం తాత్కాలికంగా ఉంటుందని.. తదుపరి సెకన్లో అన్నీ మర్చిపోతారని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో పోసానీతో కలిసి ఓ సినిమాలో వర్క్ చేసినట్లు.. ఆ సినిమా పేరు ‘ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు’అని చెప్పారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదని ఆమె అన్నారు.

రాజమౌళి డైరెక్టర్ అవ్వడానికి ముందు నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు.. ఇప్పుడు దూరం అవ్వడానికి కారణం : ఎం.ఎం శ్రీలేఖ

ఎం. ఎం శ్రీలేఖ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్లేబ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె ఎం.ఎం.కీరవాణికి సిస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్క లేడి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం.ఎం శ్రీలేఖ పేరు సంపాదించుకున్నారు. ఈమె తన 12 సంవత్సరాల వయసులోనే ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అప్పటికే ఎం.ఎం.కీరవాణి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఉండగా అతని సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు సింగర్ గా, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన శ్రీలేఖ పెళ్లి తర్వాత ఒక బాబుకు జన్మనివ్వడం తో ఒక రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయని త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు. ఈమె మొట్టమొదటిగా సంగీత దర్శకురాలిగా తాజ్ మహల్ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా సంగీత దర్శకురాలిగా పని చేశారు.

ఇంటర్వ్యూ సందర్భంగా ఎం. ఎం శ్రీలేఖ.. రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. రాజమౌళి డైరెక్టర్ కాకముందు నుంచి తనకు ఎంతో క్లోజ్ అని, తనకు ఆల్బమ్స్, చాక్లెట్స్ బాగా కొనిచ్చేవాడని తెలిపారు. అయితే ప్రస్తుతం తను డైరెక్టర్ గా మారిన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉండటం చేత ప్రస్తుతం తను దూరం అయ్యాడని ఈ సందర్భంగా శ్రీలేఖ రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.