ఎం. ఎం శ్రీలేఖ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్లేబ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె ఎం.ఎం.కీరవాణికి సిస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్క లేడి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం.ఎం శ్రీలేఖ పేరు సంపాదించుకున్నారు. ఈమె తన 12 సంవత్సరాల వయసులోనే ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అప్పటికే ఎం.ఎం.కీరవాణి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఉండగా అతని సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు సింగర్ గా, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన శ్రీలేఖ పెళ్లి తర్వాత ఒక బాబుకు జన్మనివ్వడం తో ఒక రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయని త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు. ఈమె మొట్టమొదటిగా సంగీత దర్శకురాలిగా తాజ్ మహల్ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా సంగీత దర్శకురాలిగా పని చేశారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఎం. ఎం శ్రీలేఖ.. రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. రాజమౌళి డైరెక్టర్ కాకముందు నుంచి తనకు ఎంతో క్లోజ్ అని, తనకు ఆల్బమ్స్, చాక్లెట్స్ బాగా కొనిచ్చేవాడని తెలిపారు. అయితే ప్రస్తుతం తను డైరెక్టర్ గా మారిన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉండటం చేత ప్రస్తుతం తను దూరం అయ్యాడని ఈ సందర్భంగా శ్రీలేఖ రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…