ఎం. ఎం శ్రీలేఖ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్లేబ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె ఎం.ఎం.కీరవాణికి సిస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్క లేడి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం.ఎం శ్రీలేఖ పేరు సంపాదించుకున్నారు. ఈమె తన 12 సంవత్సరాల వయసులోనే ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అప్పటికే ఎం.ఎం.కీరవాణి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఉండగా అతని సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు సింగర్ గా, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన శ్రీలేఖ పెళ్లి తర్వాత ఒక బాబుకు జన్మనివ్వడం తో ఒక రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయని త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు. ఈమె మొట్టమొదటిగా సంగీత దర్శకురాలిగా తాజ్ మహల్ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా సంగీత దర్శకురాలిగా పని చేశారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఎం. ఎం శ్రీలేఖ.. రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. రాజమౌళి డైరెక్టర్ కాకముందు నుంచి తనకు ఎంతో క్లోజ్ అని, తనకు ఆల్బమ్స్, చాక్లెట్స్ బాగా కొనిచ్చేవాడని తెలిపారు. అయితే ప్రస్తుతం తను డైరెక్టర్ గా మారిన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉండటం చేత ప్రస్తుతం తను దూరం అయ్యాడని ఈ సందర్భంగా శ్రీలేఖ రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…