Tag Archives: unemployees

మరో కొత్త స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. నిరుద్యోగులకు శుభవార్త..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ను ప్రకటించింది. ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా కేంద్రం ఈ కొత్త స్కీమ్ ను ప్రకటించడం గమనార్హం. దేశంలోని ఉపాధి కల్పనను పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్ ను తెచ్చింది.

ఈపీఎఫ్‌వో‌లో రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీ ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు, 2021 సంవత్సరం జూన్ 30 వరకు కొత్త ఉద్యోగాలు కల్పించినా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. 1000లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగి పీఎఫ్, కంపెనీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం 24 శాతాన్ని చెల్లిస్తుంది.

15,000 రూపాయల లోపు వేతనం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందగలరు. నిర్మలా సీతారామన్ 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు 1,32,000 కోట్ల రూపాయలు రీఫండ్ ఇచ్చామని.. 11 రాష్ట్రాలకు 3,621 కోట్ల రూపాయలు వడ్డీ రహిత రుణాలలో భాగంగా ఇచ్చామని వెల్లడించారు.

కేంద్రం కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక స్కీమ్ లను అమలు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులతో పాటు అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా నిధులను విడుదల చేశామని అన్నారు.

నిరుద్యోగులకు మరో శుభవార్త.. 50,000 వేతనంతో ఉద్యోగాలు!

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వే శాఖ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా బెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నోటిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1,059 ఖాళీలను భర్తీ చేయడానికి బెల్ సిద్ధమైంది.

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. బెంగ‌ళూరు యూనిట్‌, ఎక్స్‌పోర్ట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఎస్‌బీయూ, ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్‌ (బెంగ‌ళూరు), పంచ‌కుల యూనిట్‌ లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://bel-india.in/ వెబ్ సైట్ ను సందర్శించి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంన్ తెలుసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు నవంబర్ 21 చివరి తేదీ కాగా, మరికొన్ని ఉద్యోగాలకు నవంబర్ 25 ఆఖరు తేదీ. ట్రయినీ ఆఫీస‌ర్‌, ఇంజినీర్ పోస్టుల‌కు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగలకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుచెల్లించాల్సి ఉంటుంది.

బీఈ లేదా బీటెక్ లేదా బీఆర్చ్ లేదా బీఎస్సీ చదివిన అభ్యర్థులు పోస్టును బట్టి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనాన్స్ పోస్టులకు, హెచ్ఆర్ పోస్టుల‌కు ఎంబీఏ చేసిన వాళ్లు మాత్రమే అర్హులు.

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. లక్షల్లో మోసపోయిన 220 మంది..?

దేశంలో సంవత్సరం సంవత్సరానికి నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని పలు కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు, ముఠాలు చేస్తున్న మోసాలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 220 మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని తెనాలిలో కోఆపరేటివ్‌ సొసైటీ పేరుతో బ్యాంక్ ప్రారంభిస్తామనిఒక ముఠా మోసాలకు పాల్పడింది.

ఈ ముఠా ఒక్కో నిరుద్యోగి నుంచి లక్షల్లో వసూలు చేసి కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిందని సమాచారం. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బాధితులు మోసపోయామని గ్రహించి గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ విశాల్ ఇప్పటికే అధికారులను ఈ కేసు గురించి దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేశారు. లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు తమ డబ్బును వెనక్కు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే పది మంది సభ్యులు గ్రూపుగా ఏర్పడి తాము త్వరలో కోఆపరేటివ్‌ సొసైటీ పేరుతో బ్యాంకును ప్రారంభిస్తామని ప్రచారం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు ఈ బ్యాంకులో ఉపాధి కల్పిస్తామని పెద్దఎత్తున ప్రచారం చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల పేర్లతో 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నిరుద్యోగుల నుంచి ఈ ముఠా వసూలు చేసింది.

రాష్ట్రంలో గుంటూరులోని తెనాలితో పాటు 20 బ్రాంచిలను ఏర్పాటు చేశామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో డబ్బులు చెల్లించి మోసపోయామని నిరుద్యోగులు చెబుతున్నారు. డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని నిరుద్యోగులు తెలిపారు.

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. 6500 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం..?

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ డిసెంబర్ నెలలో 6,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రకటన అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్ణయాల అమలు విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ నెలలో 6,500 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని సీఎం జగన్ తెలిపారు.

తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా, నగర పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరిలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన రికూట్ మెంట్ షెఢ్యూల్ విడుదల కావచ్చని తెలుస్తోంది. నిరుద్యోగులు ఇప్పటినుంచే ప్రయత్నిస్తే సులువుగా ఉద్యోగం సాధించవచ్చు.

మరోవైపు ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడం వల్ల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీపీఎస్సీ ఈ నెల 29వ తేదీన కొత్త షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.