Tag Archives: venu swamy

Venu Swamy: టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి… ఆ హీరోకి తిరుగులేదు!

Venu Swamy: తెలుగు ప్రజలు ప్లవనామ సంవత్సరానికి స్వస్తిపలికి, శుభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే కొత్త ఏడాది మన జాతకం ఎలా ఉండబోతోందనే విషయం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల జాతకం ఈ ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ ఉంది.

Venu Swamy: టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి… ఆ హీరోకి తిరుగులేదు!

ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గతంలో నాగచైతన్య సమంత విడిపోతారనీ ఇతను చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా వేణు స్వామి ప్రభాస్ జాతకం చెబుతూ ప్రభాస్ తో సినిమా చేసే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, తన సినీ కెరీర్ ముగిసిపోయిందని వెల్లడించారు.

Venu Swamy: టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి… ఆ హీరోకి తిరుగులేదు!

తాజాగా వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు హీరోలు, హీరోయిన్ల జాతకం గురించి కామెంట్లు చేశారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆ హీరోకి ఇండస్ట్రీలో తిరుగులేదని ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన విజయాలను అందుకుంటారని తెలిపారు.ఈయన ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతాయని ఇండస్ట్రీకి ఈయన ఒక బంగారు బాతు అంటూ తెలిపారు.

వీరికి తిరుగులేదు…

ఇక అక్కినేని యువ హీరో అఖిల్ గురించి మాట్లాడుతూ అతనికి నాగ దోషం ఉందని తెలిపారు. ఇక హీరోయిన్ల ప్రస్తావన తీసుకు వస్తూ 2024 వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు హీరోయిన్లు మంచి విజయాలతో దూసుకుపోతారని వెల్లడించారు. ఆ ముగ్గురు ఎవరు అనే విషయానికి వస్తే పూజా హెగ్డే, రష్మిక, సమంతలకు 2024 వరకు ఇండస్ట్రీలో తిరుగులేదని వేణుస్వామి వెల్లడించారు. ప్రస్తుతం వీరి గురించి వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం ప్రస్తుతం వైరల్ గా మారింది.

జయలతిత, ఎన్టీఆర్ జాతకాలు ఒక్కటే.. రాజకీయాల్లోకి వస్తే సీఎం అవుతాడు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..

సమంత విడాకుల వ్యవహారంతో హాట్ టాపిక్ గా మారిన సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి. సమంత-నాగ చైతన్యలు విడిపోకముందే జోస్యం చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే జరిగింది. ఇతగాడు.. అఖిల్ కు నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగదని తేల్చిచెప్పాడు. అది కూడా అక్షరాల అదే జరిగింది. వేణు స్వామి చాలా మంది సినీ ప్రముఖులకు జ్యోతిష్యుడు.

రాజకీయ పార్టీల భవిష్యత్తుపై కూడా జ్యోతిష్యం చెబుతాడు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ 17 ఏళ్లపాటు సీఎంగా కొనసాగనున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయన నిజానికి రాజకీయాల్లోకి వచ్చారు. 2024 నాటికి పార్టీ ఉండదు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ కూడా భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసింది. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి..? దానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే సమాధానం అన్నారు.

“ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంది. టీడీపీ గెలుపుకు ఏకైక మార్గం జూనియర్ ఎన్టీఆర్ అని అన్నాడు. ఈ విషయం ఇప్పుడే కాదు.. రెండేళ్ల క్రితం కూడా చెప్పానన్నాడు. చంద్రబాబు వల్ల గానీ.. లోకేష్ వల్లగానీ టీడీపీని గట్టెక్కించడం కష్టం అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వల్లనే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాడు. 2024లో చంద్రబాబు, లోకేష్ లతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళితే అసలు పోటీ కూడా లేకుండా పోతుందని.. బాలకృష్ణ జాతకాన్ని బట్టి చూస్తే.. ఆయనకు సీఎం అయ్యే యోగం లేదన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు వందశాతం అదృష్టం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ స్టార్.. జయలలిత కూడా అదే స్టార్. ఈ నక్షత్రంలో పుట్టిన వారు రాజకీయాల్లో రాణిస్తారు. ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ జాతకం. రాజకీయాల్లోకి వస్తే ఇక తిరుగుండదు’ అన్నాడు వేణుస్వామి.

“పవన్ రాజాకీయాలలో ఉండడు.. ఆయన జాతకమే అంత..” సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన కామెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరమని.. మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో మంటలు రగిలించాయి. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వేణు స్వామిపై మండి పడుతున్నారు.

ఇక.. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా కూడా.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాను.

అలాగే జ‌రిగింది.. అని ఆయ‌న తెలిపారు. అవ‌న్నీ అచ్చం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే జ‌ర‌గ‌డం విశేషం. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణుస్వామి.

ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు.. మూడు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే జగనే ఉంటారని జోస్యం చెప్పాడు. ఒక వేళ జగన్ ను టార్గెట్ చేయాలంటే.. 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలన్నారు. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 2019 లో జగన్ కు జాతకపరంగా మంచి స్టార్ట్ కాగా.. అది 2020 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుందన్నారు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.