పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన కామెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరమని.. మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో మంటలు రగిలించాయి. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వేణు స్వామిపై మండి పడుతున్నారు.
ఇక.. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రీసెంట్గా కూడా.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాను.
అలాగే జరిగింది.. అని ఆయన తెలిపారు. అవన్నీ అచ్చం ఆయన చెప్పినట్టుగానే జరగడం విశేషం. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణుస్వామి.
ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు.. మూడు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే జగనే ఉంటారని జోస్యం చెప్పాడు. ఒక వేళ జగన్ ను టార్గెట్ చేయాలంటే.. 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలన్నారు. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 2019 లో జగన్ కు జాతకపరంగా మంచి స్టార్ట్ కాగా.. అది 2020 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుందన్నారు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…