ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ లకు ప్రేక్షకుల నుంచి ఎంత మంచి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో జోడీల వ్యవహారం గురంచి మొదటి నుంచి వింటూనే ఉన్నాం. జోడీలుగా చూపిస్తూ.. వారి మధ్య కెమెస్ట్రీని పండించడంలో ఈ షో లు పాపులర్ అయ్యాయి. అందులో మొదట చెప్పుకునే జంటల్లో రష్మీ- సుధీర్. తర్వాత వర్ష- ఇమ్మానుయేల్ జోడీ ఉంటుంది.
వీరిద్దరి రొమాంటిక్ కామెడీ స్కిట్స్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. బయట సోషల్ మీడియాలో కూడా ఈ జంట అప్డేట్స్ తో రచ్చ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించేసినా మళ్ళీ దాన్నే ఫోకస్ చేస్తూ వాళ్ళిద్దరి గుట్టు రట్టు చేసింది జబర్దస్త్ జడ్జ్ రోజా. అసలేమైందంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో మీరిద్దరు రెండ్రోజుల క్రితం ఎక్కడకు వెళ్లారు అంటూ అడుగుతుంది.
వాళ్లు దానికి సమాధానంగా ఆ రోజు తాను షూటింగ్లో ఉన్నాను..ఇమాన్యుయేల్ వేరే చోట ఉన్నాడు అని వర్ష చెప్తుంది. అవునా.. మరి ఈ ఫొటో ఏంటి అంటూ.. ఇద్దరు కారులో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నా ఫొటోను చూపిస్తూ.. కారులో షికార్లు కొడుతూ.. అబద్దాలు చెబుతారా అంటూ రోజా సరదాగా అంటుంది. అది చూసిన వర్ష ఇమ్మానుయేల్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
ఇక ఆ ఫొటోపై వర్ష రియాక్ట్ అవుతూ ఇలా చెబుతుంది. ఆ రోజు షూట్ లో నాకు బాలేదని ఇమాన్యుయేల్కు ఫోన్ చేస్తే.. నా గొంతు విని దాంట్లోనే నా మూడ్ బాలేదని అర్థం చేసుకుని నేనున్న చోటుకి ఇమ్మానుయేల్ వచ్చేశాడని చెప్పుకొచ్చింది వర్ష. ఇక ఈ ఫన్నీ సన్నివేశాలతో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని రోజుల వరకు వీళ్లద్దిరి మద్య కెమస్ట్రీని చూపించని మల్లెమాల మళ్లీ.. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ పై ఫోకస్ పెంచేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…