ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ లకు ప్రేక్షకుల నుంచి ఎంత మంచి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో జోడీల వ్యవహారం గురంచి మొదటి నుంచి వింటూనే ఉన్నాం. జోడీలుగా చూపిస్తూ.. వారి మధ్య కెమెస్ట్రీని పండించడంలో ఈ షో లు పాపులర్ అయ్యాయి. అందులో మొదట చెప్పుకునే జంటల్లో రష్మీ- సుధీర్. తర్వాత వర్ష- ఇమ్మానుయేల్ జోడీ ఉంటుంది.
వీరిద్దరి రొమాంటిక్ కామెడీ స్కిట్స్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. బయట సోషల్ మీడియాలో కూడా ఈ జంట అప్డేట్స్ తో రచ్చ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించేసినా మళ్ళీ దాన్నే ఫోకస్ చేస్తూ వాళ్ళిద్దరి గుట్టు రట్టు చేసింది జబర్దస్త్ జడ్జ్ రోజా. అసలేమైందంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో మీరిద్దరు రెండ్రోజుల క్రితం ఎక్కడకు వెళ్లారు అంటూ అడుగుతుంది.
వాళ్లు దానికి సమాధానంగా ఆ రోజు తాను షూటింగ్లో ఉన్నాను..ఇమాన్యుయేల్ వేరే చోట ఉన్నాడు అని వర్ష చెప్తుంది. అవునా.. మరి ఈ ఫొటో ఏంటి అంటూ.. ఇద్దరు కారులో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నా ఫొటోను చూపిస్తూ.. కారులో షికార్లు కొడుతూ.. అబద్దాలు చెబుతారా అంటూ రోజా సరదాగా అంటుంది. అది చూసిన వర్ష ఇమ్మానుయేల్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
ఇక ఆ ఫొటోపై వర్ష రియాక్ట్ అవుతూ ఇలా చెబుతుంది. ఆ రోజు షూట్ లో నాకు బాలేదని ఇమాన్యుయేల్కు ఫోన్ చేస్తే.. నా గొంతు విని దాంట్లోనే నా మూడ్ బాలేదని అర్థం చేసుకుని నేనున్న చోటుకి ఇమ్మానుయేల్ వచ్చేశాడని చెప్పుకొచ్చింది వర్ష. ఇక ఈ ఫన్నీ సన్నివేశాలతో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని రోజుల వరకు వీళ్లద్దిరి మద్య కెమస్ట్రీని చూపించని మల్లెమాల మళ్లీ.. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ పై ఫోకస్ పెంచేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…