నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో జై బాలయ్య పాటను విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. బాలయ్య నటించిన సినిమాలు డిసెంబర్ లో విడుదల కావడం ఇది కొత్తేమి కాదు.. అంతక ముందు `రామ్ – రహీమ్, కథానాయకుడు, పట్టాభిషేకం, రక్తాభిషేకం, 1990లో విడుదలైన లారీ డ్రైవర్. ఇందులో లారీ డ్రైవర్ బాక్సాఫీస్ ను ఒక షేక్ చేసేసింది. అది పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత డిసెంబర్ లో విడుదలైన సినిమాలు నిరాశనే మిగిల్చాయి.
ఇక మళ్లీ 2021, డిసెంబర్ 2 న వస్తున్న అఖండ కూడా లారీడ్రైవర్ లాగా మంచి సక్సెస్ సాధించి దూసుకెళ్తాడో.. లేదో చూడాలి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అఖండ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా మే 28న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే రెండవ కరోనా వైరస్ కారణంగా, మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు.
బాలకృష్ణ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. అఖండ సినిమా పూర్తవడంతో బాలకృష్ణ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ తో మరో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రీసెంట్గా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రుతి హాసన్ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…