Tag Archives: Visakhapatnam

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు, ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ప్రస్తుతం రైల్వే జోన్ తీసుకురావాలనే ప్రతి పాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ.. అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. కానీ ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఈ జోనల్ తో ఆ కోరిక తీరనుంది. పూర్తి స్థాయిలో విశాఖ పట్నం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన అన్ని పనులను త్వరలో ప్రారంభం కానున్నానయని కూడా ప్రకటన చేశారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ జోన్ కు సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధమైందని చెప్పినట్లు జి.వి.ఎల్ నరసింహారావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదొక శుభవార్త అని తెలిపారు.

గడిచిన మూడు సంవత్సరాలను నుంచి..

ఈ విశాఖ రైల్వే జోన్ భవన నిర్మాణ కార్యాలయం కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుందని.. పూర్తి స్థాయిలో రైల్వే జోన్ కార్యకలాపాలను అతి త్వరలోనే జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇక రైల్వే బోర్టు అనేది వాస్తవానికి జోన్లు తగ్గించాలనే ఆలోచనలో ఉందని.. విశాఖ రైల్వే జోన్ రైల్వే‌స్‌కు నష్టం కలిగించే ప్రతిపాదన అయినప్పటికీ.. మోదీకి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలనే ఈ మంచి నిర్ణయం తీసుకున్నారననారు. డీపీఆర్ త్వరలోనే ఆమోదింపబడి పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాలను నుంచి పన్నులు రూపంలో ఏపీ నుంచి కలెక్ట్ చేసిన మొత్తం కంటే.. ఎక్కువ మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

కొద్దిక్షణాల్లో పెళ్లి.. వధువు తల్లిదండ్రులు ఆత్మహత్య.. చివరకు ఏం జరిగిందంటే..!

కాసేపట్లో వివాహం జరుగుతుందనగా.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగింది.. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంకు చెందిన జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు.

వీరికి ఒక కూతురు ఉన్నారు. ఆమెకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిపించారు. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పెళ్లి ఓ ఫంక్షన్ హాల్ లో జరుగుతుండగా.. ఆ దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక పెళ్లి జరుగుతుండగా.. పంతులు కన్యాదానం చేయడానికి వధువు తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరాడు. వాళ్ల కోసం బంధువులు వెతికారు.. అయినా ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్లి చూడగా విగత జీవులుగా పడి ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థతి గత కొంత కాలంగా మంచిగా లేదని.. మానసిక వ్యాధితో బాధపడేదని పోలీసులు తెలుసుకున్నారు. చుట్టు పక్కల వారితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పెళ్లింట్లో కూడా గొడవ పడిన ఆమె ప్రవర్తనతో జగన్నాథరావు విసుగు చెందాడు.

దీంతో ఆమెను చంపి.. తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటు కన్న తల్లిదండ్రులు చనిపోయి.. అటు పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఆ వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆ దేవాలయంలో అపచారం.. ముదిరిన వివాదం.. ఇంతకు ఏం జరుగుతోంది..?

ఆ దేవాలయంలోని గోశాలలో పాలు విక్రయిస్తున్నారని.. ఇది అపచారం అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ దేవాలయం ఎక్కడో కాదు.. విశాఖ సింహాచలం నరసింహస్వామి ఆలయంలో ఈ పని జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ వివాదం ఏర్పడడంతో ముదురుతూ వచ్చింది. తాజాగా వీటిపై దేవస్థానం అధికారులు వివరణ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం కరోనా సమయంలో అన్నదానాలు నిలిచి పోవడంతో పాలు మిగులుతున్నాయని.. వృధాగా రోజూ పారబోయాల్సి వస్తుందని.. అందుకే దేవాలయ చుట్టుపక్కల వాళ్లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ దేవాలయంలోని గోశాలలో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి రోజూ ఉదయం 7 గంటలకు.. సాయంత్రం 5 గంటలకు దేవస్థానం అవసరాలకు పోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నారు.

విశాఖ సింహాచలం నరసింహస్వామి దేవాలయ ఈఓ దేవస్థానంకు ఉపయోగించాల్సిన పాలను ఇంటికి తీసుకెళ్లాడని.. ఇది అపచారం అంటూ అనడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ లీటరు పాలను రూ.40 కు విక్రయిస్తున్నారు. ఎవరికీ ఉచితంగా పాలను విక్రయించడం లేదని తెలిపారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులను దేవస్థానం అకౌంట్లోనే డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు దేవస్థానం అధికారులు.

పాలను విక్రయించడం వల్ల రోజుకు సుమారు రూ.800 వస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పాలను ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇందులో అపచారాలు, అన్యాయాలేమీ లేవని ఆలయ అధికారులు అంటున్నారు. అక్కడ చుట్టు పక్కల ఉన్న దేవాలయాలకు, ఉపదేవాలయాలకు పాలను పంపించిన తర్వాతనే మిగిలిన పాలను అమ్ముతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో విశాఖపట్నం మునిగిపోనుందా.. ఇందులో నిజమెంత..?

వైజాగ్ సముద్రంలో మునిగిపోతుందన్న వార్త గత రెండు రోజుల నుంచి వినపడుతోంది. రానున్న 80 సంవత్సరాల్లో వైజాగ్ మూడు అడుగుల నీటిలో ఉంటుందని.. ఆ తర్వాత కనుమరుగయ్యే ప్రమాదముందని ఓ నివేదిక తేల్చింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) ఇచ్చిన ఈ నివేదిక భయాందోళనకు గురిచేస్తోంది. విశాఖపట్నంతో పాటు దేశంలోని 12 నగరాలు దాదాపు మూడు అడుగుల మేర సముద్రపు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది.

అయితే నిపుణులు మాత్రం తూర్పు కనుమల కొండ ప్రాంతాలు సముద్రానికి అడ్డుగా ఉండటం వల్ల.. నగరం మునిగిపోయే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. సుమద్రం మట్టం అనేది పెరుగుతంది.. కానీ ఒకే స్థాయిలో పెరగదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ హెడ్ జీపీఎస్ మూర్తి తెలిపారు.

ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ నివేదిక కేవలం అంచనా మాత్రమే అని.. అది వాతావరణ మార్పులపై మాత్రమే ఆధారపడి ఉంటాయని మూర్తి చెప్పారు. రాబోయే కాలంలో వాతావరణ మార్పులు అనేవి చోటుచేకుంటాయని.. లోతట్టు ప్రాంతాలైన నెల్లూరు, చెన్నైలలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతుందని.. కానీ విశాఖపట్నంలోని సముద్ర జలాలు బీచ్ రోడ్డును కూడా చేరుకోలేవని మూర్తి విశ్లేషించారు.

భౌగోళిక స్థానాలు అనుకూలంగా ఉండటమే దీనికి కారణం అని మూర్తి వివరించారు. సుమద్రపు తీర ప్రాంతాలైన చెన్నై, మంగళూరు, ముంబై, విశాఖపట్నం 2100 నాటికి సముద్రంలో మునిగిపోతాయని ఐపీసీసీ నివేదిక అంచనా వేయడంతో వీటిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.