ఆ దేవాలయంలోని గోశాలలో పాలు విక్రయిస్తున్నారని.. ఇది అపచారం అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ దేవాలయం ఎక్కడో కాదు.. విశాఖ సింహాచలం నరసింహస్వామి ఆలయంలో ఈ పని జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ వివాదం ఏర్పడడంతో ముదురుతూ వచ్చింది. తాజాగా వీటిపై దేవస్థానం అధికారులు వివరణ కూడా ఇచ్చారు.
ప్రస్తుతం కరోనా సమయంలో అన్నదానాలు నిలిచి పోవడంతో పాలు మిగులుతున్నాయని.. వృధాగా రోజూ పారబోయాల్సి వస్తుందని.. అందుకే దేవాలయ చుట్టుపక్కల వాళ్లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ దేవాలయంలోని గోశాలలో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి రోజూ ఉదయం 7 గంటలకు.. సాయంత్రం 5 గంటలకు దేవస్థానం అవసరాలకు పోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నారు.
విశాఖ సింహాచలం నరసింహస్వామి దేవాలయ ఈఓ దేవస్థానంకు ఉపయోగించాల్సిన పాలను ఇంటికి తీసుకెళ్లాడని.. ఇది అపచారం అంటూ అనడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ లీటరు పాలను రూ.40 కు విక్రయిస్తున్నారు. ఎవరికీ ఉచితంగా పాలను విక్రయించడం లేదని తెలిపారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులను దేవస్థానం అకౌంట్లోనే డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు దేవస్థానం అధికారులు.
పాలను విక్రయించడం వల్ల రోజుకు సుమారు రూ.800 వస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పాలను ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇందులో అపచారాలు, అన్యాయాలేమీ లేవని ఆలయ అధికారులు అంటున్నారు. అక్కడ చుట్టు పక్కల ఉన్న దేవాలయాలకు, ఉపదేవాలయాలకు పాలను పంపించిన తర్వాతనే మిగిలిన పాలను అమ్ముతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…