General News

ఆ దేవాలయంలో అపచారం.. ముదిరిన వివాదం.. ఇంతకు ఏం జరుగుతోంది..?

ఆ దేవాలయంలోని గోశాలలో పాలు విక్రయిస్తున్నారని.. ఇది అపచారం అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ దేవాలయం ఎక్కడో కాదు.. విశాఖ సింహాచలం నరసింహస్వామి ఆలయంలో ఈ పని జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ వివాదం ఏర్పడడంతో ముదురుతూ వచ్చింది. తాజాగా వీటిపై దేవస్థానం అధికారులు వివరణ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం కరోనా సమయంలో అన్నదానాలు నిలిచి పోవడంతో పాలు మిగులుతున్నాయని.. వృధాగా రోజూ పారబోయాల్సి వస్తుందని.. అందుకే దేవాలయ చుట్టుపక్కల వాళ్లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ దేవాలయంలోని గోశాలలో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి రోజూ ఉదయం 7 గంటలకు.. సాయంత్రం 5 గంటలకు దేవస్థానం అవసరాలకు పోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నారు.

విశాఖ సింహాచలం నరసింహస్వామి దేవాలయ ఈఓ దేవస్థానంకు ఉపయోగించాల్సిన పాలను ఇంటికి తీసుకెళ్లాడని.. ఇది అపచారం అంటూ అనడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ లీటరు పాలను రూ.40 కు విక్రయిస్తున్నారు. ఎవరికీ ఉచితంగా పాలను విక్రయించడం లేదని తెలిపారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులను దేవస్థానం అకౌంట్లోనే డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు దేవస్థానం అధికారులు.

పాలను విక్రయించడం వల్ల రోజుకు సుమారు రూ.800 వస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పాలను ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇందులో అపచారాలు, అన్యాయాలేమీ లేవని ఆలయ అధికారులు అంటున్నారు. అక్కడ చుట్టు పక్కల ఉన్న దేవాలయాలకు, ఉపదేవాలయాలకు పాలను పంపించిన తర్వాతనే మిగిలిన పాలను అమ్ముతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

22 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

22 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago