వైజాగ్ సముద్రంలో మునిగిపోతుందన్న వార్త గత రెండు రోజుల నుంచి వినపడుతోంది. రానున్న 80 సంవత్సరాల్లో వైజాగ్ మూడు అడుగుల నీటిలో ఉంటుందని.. ఆ తర్వాత కనుమరుగయ్యే ప్రమాదముందని ఓ నివేదిక తేల్చింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) ఇచ్చిన ఈ నివేదిక భయాందోళనకు గురిచేస్తోంది. విశాఖపట్నంతో పాటు దేశంలోని 12 నగరాలు దాదాపు మూడు అడుగుల మేర సముద్రపు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది.
అయితే నిపుణులు మాత్రం తూర్పు కనుమల కొండ ప్రాంతాలు సముద్రానికి అడ్డుగా ఉండటం వల్ల.. నగరం మునిగిపోయే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. సుమద్రం మట్టం అనేది పెరుగుతంది.. కానీ ఒకే స్థాయిలో పెరగదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ హెడ్ జీపీఎస్ మూర్తి తెలిపారు.
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ నివేదిక కేవలం అంచనా మాత్రమే అని.. అది వాతావరణ మార్పులపై మాత్రమే ఆధారపడి ఉంటాయని మూర్తి చెప్పారు. రాబోయే కాలంలో వాతావరణ మార్పులు అనేవి చోటుచేకుంటాయని.. లోతట్టు ప్రాంతాలైన నెల్లూరు, చెన్నైలలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతుందని.. కానీ విశాఖపట్నంలోని సముద్ర జలాలు బీచ్ రోడ్డును కూడా చేరుకోలేవని మూర్తి విశ్లేషించారు.
భౌగోళిక స్థానాలు అనుకూలంగా ఉండటమే దీనికి కారణం అని మూర్తి వివరించారు. సుమద్రపు తీర ప్రాంతాలైన చెన్నై, మంగళూరు, ముంబై, విశాఖపట్నం 2100 నాటికి సముద్రంలో మునిగిపోతాయని ఐపీసీసీ నివేదిక అంచనా వేయడంతో వీటిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…