Tag Archives: ycp party

V.V Vinayak: వైసిపి పార్టీలోకి రాబోతున్న మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. ఎంపీ అభ్యర్థిగా పోటీ?

V.V Vinayak: ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికలపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలలో కూడా పెద్ద ఎత్తున మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి ఎలాగైనా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పార్టీ నేతలు పెద్ద ఎత్తున కసరత్తులు మొదలు పెడుతున్నారు.

ఇకపోతే తాజాగా వైఎస్సార్సీపీ పార్టీలోకి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రాబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈయన వైసిపి పార్టీలోకి వచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ ఈ వార్త వైరల్ గా మారింది ఇప్పటికే వినాయక్ కుటుంబ సభ్యులకు కొందరు వైసిపి పార్టీలో ఉన్నారు. దీంతో ఈయన కూడా పార్టీలోకి రాబోతున్నారని వార్తలు హల్ చల్ చేశాయి.

రాజకీయాలు పడవు..

ఇటీవల వినాయక్ కాకినాడలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమంలో ఈయన కూడా కనిపించడంతో తప్పకుండా ఈయన పార్టీలోకి వస్తున్నారని అందరూ భావించారు ఈ క్రమంలోనే వైసిపి పార్టీలో ఉన్నటువంటి వినాయక్ సోదరుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. వినాయక్ గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని, తనకు రాజకీయాలు అంటే పడవని తెలిపారు. ఈ వార్తలు కేవలం అవాస్తవాలేనని ఈయన కొట్టి పారేశారు.

Posani Krishna Murali: నేను చనిపోతే ఏడవద్దని నా భార్యకు చెప్పాను… ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు నన్ను చూడకూడదు: పోసాని

Posani Krishna Murali:పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలో నటుడు దర్శకుడిగా కామెడీగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈయన వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా నిలబడి పార్టీ కోసం కృషి చేయడంతో ఈయనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పారు.

ఇలా ఈయన వైసిపి పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వారి పట్ల కూడా పలు సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచినటువంటి పోసాని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను చనిపోతే కనుక తన శవాన్ని ఇండస్ట్రీ వారికి చూపించవద్దు అటు తన భార్యకు చెప్పానని ఈయన తెలిపారు. అంతేకాకుండా నేను చనిపోతే నా భార్య పిల్లలు ఎవరు కూడా ఏడవకూడదు అలా ఉండేలాగా వారిని ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టానని ఈయన తెలియజేశారు.నేను చనిపోయిన తర్వాత నా భార్య నాతో ఉన్నటువంటి అందమైన క్షణాలన్నింటిని గుర్తు చేసుకోవాలి కానీ ఏడవకూడదు.

Posani Krishna Murali:50 కోట్ల ఆస్తులు రాశాను…


ఇకపోతే నా పిల్లలు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. నేను చనిపోయిన తర్వాత నా భార్య ఇబ్బంది పడకూడదు అందుకే తనకోసం 50 కోట్ల రూపాయల ఆస్తులను తన పేరు మీద రాశానని తను ఏ పని చేయకపోయినా నెలకు 9 కోట్ల రూపాయల సంపాదన అందుకుంటుంది అంటూ ఈ సందర్భంగా పోసాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన పోసాని చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ వారు ఎవరు చూడకూడదని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Prudhvi Raj Daughter: నాన్న రాజకీయాలు నాకు నచ్చవు… నటుడు పృథ్వీరాజ్ పై కామెంట్స్ చేసిన కూతురు!

Prudhvi Raj Daughter: సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయ్యారు కమెడియన్ పృథ్వీరాజ్. ఇలా ఈ డైలాగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఈయన గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన విషయం మనకు తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈయనకు వైసిపి ప్రభుత్వం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పదవిని అప్ప చెప్పింది.

అయితే కొన్ని కారణాలవల్ల ఈ పదవి నుంచి తొలగించడంతో పృధ్విరాజ్ సైతం ప్లేట్ ఫిటాయించారు.
ప్రస్తుతం ఈయన వైసీపీ పార్టీకి కాకుండా జనసేన పార్టీకి జై అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక కమెడియన్ గా ఈయనకు అవకాశాలు తగ్గడంతో డైరెక్టర్ గా మారిపోయారు ఈ క్రమంలోనే క్రాంతి అనే హీరోతో తన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రాన్ని చేస్తున్నారు.

ఈ సినిమాలో పృధ్విరాజ్ కుమార్తె హీరోయిన్ గా నటించడం విశేషం అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన తండ్రి గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమాలో అవకాశం తనకు తన తండ్రి ఒక కూతురుగా ఇవ్వలేదని ఈ పాత్రకు తాను కరెక్ట్ గా సరిపోతానన్న ఉద్దేశంతో నాన్న తనకు ఈ పాత్ర ఇచ్చారని తెలియజేశారు.

Prudhvi Raj Daughter: నాన్నకు పాలిటిక్స్ అంటే ఇష్టం…


ఇక నాన్న సినిమాలలో ఎంతో అద్భుతమైన కామెడీ చేస్తూ మంచి మంచి పాత్రలలో నటించారు. నేను తన పాత్రలను ఎంతో ఇష్టపడతాను కానీ తన రాజకీయాలు నాకు నచ్చవని తెలిపారు.పాలిటిక్స్ లోకి వెళ్లొద్దని నాన్నకు నేను చెప్పలేను ఎందుకంటే నాన్నకు పాలిటిక్స్ అంటే ఎంతో ఇష్టమని ఈమె తెలియజేశారు అయితే ఇండస్ట్రీలోకి వచ్చేముందు నాన్న నాకు ఒకే విషయం చెప్పారు. మీ ముందు వెనుక చాలా జరుగుతుంటాయి కానీ వాటిని పట్టించుకోకు అని సలహా ఇచ్చారని శ్రీలు తెలిపారు.

RK Roja: చిన్న చిన్న యాంకర్లే పెద్ద కార్లు కొంటున్నారు.. నేను కొంటె తప్పా… రోజా అన్నది ఆ యాంకర్ నేనా.. వైరల్ అవుతున్న కామెంట్స్!

RK Roja: వెండితెర నటిగా, బుల్లితెర న్యాయ నిర్ణేతగా, రాజకీయ నాయకురాలిగా మంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి విశేషమైన ప్రేక్షకాదరణ గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో సుమారు 150 సినిమాలకు హీరోయిన్ గా పనిచేశారు. అలాగే రచ్చబండ జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఇకపోతే మంత్రిగా ఈమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రోజా ఎంతో ఖరీదైన కోట్ల విలువ చేసే కారు కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కారుపై ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై రోజా స్పందిస్తూ తాను ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని తాను ఇలా కోట్ల రూపాయల విలువచేసే కారు కొనడంలో ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఈమె తెలిపారు.తాను ఎలాంటి అక్రమ సంపాదనతో కొనలేదని కావలసి వస్తే తన ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు.

RK Roja: యాంకర్ల గురించి రోజా షాకింగ్ కామెంట్స్…

ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి యాంకర్లుగా పనిచేస్తున్న వారి పెద్ద పెద్ద ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చిన్నచిన్న యాంకర్లే ఖరీదైన కార్లలో తిరుగుతున్నప్పుడు తాను ఇలాంటి కారు కొనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విధంగా రోజా యాంకర్ల గురించి ప్రస్తావన చేయడంతో రోజా అన్నది ఏ యాంకర్ ని..ఈమె యాంకర్ మంజుషని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే మంజూష ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బెంజ్ కార్ కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే రోజా ఈమెను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.

RK Roja: జబర్దస్త్ ద్వారా లక్షలు సంపాదించా… కావాలంటే నా ఐటీ రిటన్స్ చెక్ చేసుకోండి.. సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..!

RK Roja: వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రోజా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న ఈమె మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందిన రోజా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ తాను జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఈమె దాదాపు పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన ఈమె మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఇక తాజాగా రోజా కోట్లు విలువచేసే ఖరీదైన కారును కొనుగోలు చేశారు.

ఇలా ఈమె ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో ప్రతిపక్ష నేతలు రోజాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రోజా అక్రమంగా సంపాదిస్తూ ఇలాంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసింది అంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈమె గురించి ఇలా ప్రతిపక్ష నేతలు మాట్లాడటంతో రోజా స్పందించి ఘాటుగా సమాధానం చెప్పారు.

RK Roja: ప్రతిపక్షాలకు ఘాటుగా జవాబిచ్చిన మంత్రి…

తాను 150 సినిమాలకు పైగా నటించాను. అలాగే పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతున్నాను జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు.అంతగా అనుమానం ఉంటే నేను కట్టే ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మొత్తానికి రోజా గురించి వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించి చెక్ పెట్టారు.