RK Roja: వెండితెర నటిగా, బుల్లితెర న్యాయ నిర్ణేతగా, రాజకీయ నాయకురాలిగా మంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి విశేషమైన ప్రేక్షకాదరణ గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో సుమారు 150 సినిమాలకు హీరోయిన్ గా పనిచేశారు. అలాగే రచ్చబండ జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఇకపోతే మంత్రిగా ఈమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రోజా ఎంతో ఖరీదైన కోట్ల విలువ చేసే కారు కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కారుపై ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై రోజా స్పందిస్తూ తాను ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని తాను ఇలా కోట్ల రూపాయల విలువచేసే కారు కొనడంలో ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఈమె తెలిపారు.తాను ఎలాంటి అక్రమ సంపాదనతో కొనలేదని కావలసి వస్తే తన ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు.
ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి యాంకర్లుగా పనిచేస్తున్న వారి పెద్ద పెద్ద ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చిన్నచిన్న యాంకర్లే ఖరీదైన కార్లలో తిరుగుతున్నప్పుడు తాను ఇలాంటి కారు కొనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విధంగా రోజా యాంకర్ల గురించి ప్రస్తావన చేయడంతో రోజా అన్నది ఏ యాంకర్ ని..ఈమె యాంకర్ మంజుషని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే మంజూష ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బెంజ్ కార్ కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే రోజా ఈమెను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…