Tarakaratna : తారకరత్న పెద్ధకర్మ కూడా బాలకృష్ణ, విజయసాయి చేతుల మీదుగానే… మోహన్ కృష్ణ గారికి ఇంత పంతమా…!

Tarakaratna : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఇక ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబానికి దూరమయ్యాడు. దీంతో ఆయన భార్య, పిల్లలు బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే సంశయం అందరిలోనూ ఉండగా చావు సమయంలో కూడా తారకరత్న తండ్రి కొడుకు ఇంటికి రాకపోవడం వల్ల ఇక అలేఖ్య రెడ్డికి అత్త మామల సపోర్ట్ ఉండదనే అనిపిస్తుంది. కొడుకు అంత్యక్రియలు మోహన్ కృష్ణ చేసారు కానీ తారకరత్న పిల్లలను కూడా ఆయన దగ్గరకు తీసుకోలేదు. ఇంత కఠినంగా ఎవరైనా ఉంటారా అని అందరినీ ఆశ్చర్య పరిచారు మోహన్ కృష్ణ.

పెద్దకర్మ కూడా వాళ్ళిద్దరే చేస్తున్నారు…

లేటెస్ట్ గా తారకరత్న చిన కర్మ ఆయన పుట్టినరోజు నాడు జరుగగా ఇక ఆయన దశదిన కర్మ కార్యక్రమం మార్చి 2న గురువారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద జరగనుండగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కార్యక్రమాన్ని జరుపుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ విజయసాయి రెడ్డి పేర్లు ముఖ్యంగా ఉన్నాయి. నిజానికి కార్యక్రమం జరిపించాల్సింది మోహనకృష్ణ గారే అయినా ఆయన పంతం ఇంకా తగ్గలేదేమో అనిపిస్తుంది. అందుకే తారకరత్న బాధ్యత్సలను బాలకృష్ణ తన భుజాన వేసుకున్నాడు.

ఇక అలేఖ్య రెడ్డి పేరు, పిల్లలు పేర్లు, అలేఖ్య రెడ్డి తల్లిదండ్రుల తరుపు వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ ఎక్కడా మోహనకృష్ణ, ఆయన భార్య, కూతరు పేర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అభిమానులు అందరూ వచ్చి తారకరత్న కు నివాళులు అర్పించవచ్చని అందులో ఆహ్వానించారు. తారకరత్న కు పేరుకు మావయ్య వరస అయ్యే విజయసాయి రెడ్డి అలాగే తారకరత్న కు బాబాయ్ అయ్యే బాలకృష్ణ నే మొత్తం కార్యక్రమం నిర్వహిస్తుండడంతో అందరూ కొడుకే పోయినా ఇంకా పంతం పోలేదా అంటూ మోహన్ కృష్ణ గారి గురించి అంటున్నారు.