Tarakaratna Wife: ఒక్క క్షణం కూడా మర్చిపోలేను ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి.. వీడియో వైరల్!

Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే..

ఇలా ఈయన మరణించి దాదాపు రెండు నెలలు అవుతున్న ఇప్పటికీ ఈయన మరణ వార్త నుంచి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కోలుకోలేదని తెలుస్తుంది. తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మధ్యలోనే వదిలి వెళ్లిపోవడంతో ఈమె ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

ఇలా తన భర్త మరణంతో ఎంతో కృంగిపోతున్న అలేఖ్య రెడ్డి తరచు సోషల్ మీడియా వేదికగా తన భర్తతో తనకు ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన అలేఖ్య రెడ్డి తాజాగా తన భర్త తన పిల్లలతో ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ కు సంబంధించిన వీడియో షేర్ చేశారు.

Tarakaratna Wife: ఈ బాధ నుంచి బయటపడాలి…


ఇక ఈ వీడియోని ఈమె షేర్ చేస్తూ నిన్ను గుర్తు చేసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇలా ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై ఎంతోమంది స్పందిస్తూ తొందరగా మీరు ఈ బాధ నుంచి బయటపడాలి అంటూ ఈమెకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.