Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే..
ఇలా ఈయన మరణించి దాదాపు రెండు నెలలు అవుతున్న ఇప్పటికీ ఈయన మరణ వార్త నుంచి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కోలుకోలేదని తెలుస్తుంది. తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మధ్యలోనే వదిలి వెళ్లిపోవడంతో ఈమె ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
ఇలా తన భర్త మరణంతో ఎంతో కృంగిపోతున్న అలేఖ్య రెడ్డి తరచు సోషల్ మీడియా వేదికగా తన భర్తతో తనకు ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన అలేఖ్య రెడ్డి తాజాగా తన భర్త తన పిల్లలతో ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ కు సంబంధించిన వీడియో షేర్ చేశారు.
ఇక ఈ వీడియోని ఈమె షేర్ చేస్తూ నిన్ను గుర్తు చేసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇలా ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై ఎంతోమంది స్పందిస్తూ తొందరగా మీరు ఈ బాధ నుంచి బయటపడాలి అంటూ ఈమెకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…