Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

Tollywood-Bollywood: సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్లు ఇకపై తమ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వెళ్లిన పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!
Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

బాహుబలి1,2 సినిమా ద్వారా టాలీవుడ్ సత్తాను బాలీవుడ్ కు రుచిచూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ కలెక్షన్లు మరోసారి కొల్లగొట్టాలని చూస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. 

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

ఇప్పటికే అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే అక్కడ రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ ఊపుతో సుకుమార్ పుష్ప-2ను తెరకెక్కించనున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా బాలీవుడ్ పై తన ముద్ర వేయాలనుకుంటున్నారు. 

మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు హారికా అండ్ హాసిని క్రియేషన్ ప్లాన్ చేస్తోంది. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా ఓ సినిమా రానుంది. దీనికన్నా ముందుగానే మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. వీళ్లే కాకుండా తమిళ డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియా మూవీలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ చిత్ర సీమ నుంచి కేజీఎఫ్ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టింది. హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ప్యాన్ ఇండియా రేంజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా త్వరలో బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో విడుదల కానుంది.