టీవీ నటికి రూ. 340 కోట్ల జరిమానా.. అంత జరిమానా ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఇది చదవండి..

ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి ఆదాయం అనేది వివిధ రకాల పన్నుల ద్వారానే వస్తుంది. వాటి ద్వారానే వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారు. అది ఆదాయపు పన్ను కావచ్చు.. కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు.. ఇంకా ఏదైనా ట్యాక్స్ కావచ్చు. ఆదాయానికి మించి ఎవరికైనా అదనపు ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలి.

అయితే ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు పన్నులకు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తోంది. ఇలా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఓ సెలెబ్రెటీపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు రూ.340 కోట్లు కట్టాలని సమన్లు కూడా జారీ చేసింది. ఆ పన్ను కట్టే వరకు ఎలాంటి షోలకు, సినిమాలకు వెళ్లే హక్కు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆమె పేరు జెంగ్‌‌‌‌ షువాంగ్‌.

చైనాలో అతి పెద్ద సెలబ్రిటీ. ఈమె గత రెండు సంవత్సరాల్లో సినిమాలు, టీవీ సరీస్ ల కోసం తీసుకున్న పేమెంట్ కు సంబంధించి పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ సర్వీస్‌ గుర్తించింది. అంతకముందే ఆమెకు ఛాన్స్ ఇచ్చి చూశారు. అయినా ఆమె పన్ను కట్టకపోవడంతో పలు సినిమాల్లో నటించేందుకు నిషేధం విధించడంతో పాటు.. జరిమానా కూడా విధించారు.

చైనా ప్రభుత్వం పన్నులను వసూలు చేసే విషయంలా కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి రాజకీయ నాయకులు, సెటబ్రిటీలు ఎవరూ అతీతులు కాదంటూ పేర్కొంది. మన దేశంలో కూడా పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.