Uday Kiran: రీ రిలీజ్ కి సిద్ధమైన ఉదయ్ కిరణ్ సినిమాలు.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే?

Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయనకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా చిత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే వంటి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు. ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇలా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి ఉదయ్ కిరణ్ కెరియర్ అమాంతం ఆగిపోయింది. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఇలా ఉదయ్ కిరణ్ మరణించినప్పటికీ అభిమానులు ఇప్పటికీ ఈయనని మర్చిపోలేదని చెప్పాలి. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ముఖ్యంగా ఈయన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయినటువంటి నువ్వు నేను మనసంతా నువ్వే చిత్రాలు ఎవర్ గ్రీన్ సినిమాలని చెప్పాలి. ఇక ఉదయ్ కిరణ్ మరణించిన తర్వాత మొదటిసారి ఆయన సినిమాలను తిరిగి థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

మనసంతా నువ్వే…
ఈ క్రమంలోనే తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమాలను తిరిగి మార్చి ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ విడుదల విషయం గురించి ఇంకా అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ సినిమాలను తిరిగి థియేటర్లలో చూడబోతున్నామని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.