Uma Maheswari: పోలీసుల చేతికి వచ్చిన ఉమామహేశ్వరి పోస్ట్ మార్టం రిపోర్ట్… ఆమె చనిపోవడానికి కారణం అదేనా?

Uma Maheswari:దివంగత నటుడు రాజకీయ నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఈమె ఆకస్మిక మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.అయితే ఈమె కేవలం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు భావించారు.

ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం ఈమె పార్తివదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తాజాగా ఈమె పోస్టుమార్టం నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులకు అందించారు.

ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు ఈమె మృతి చెందడానికి గల కారణాలను వెల్లడించారు. ఉమామహేశ్వరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఈమె ఉరి వేసుకోవడంతో స్వర పేటిక విరిగిపోయిందని పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు గురించి వెల్లడించారు. ఇలా ఈమె అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.

Uma Maheswari: ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎన్టీఆర్…

ఇక ఈమె మరణ వార్త విన్న నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. అయితే ఈమె చనిపోయినప్పటికీ ఎన్టీఆర్ ఇండియాలో లేకపోవడంతో ఈమె చివరి చూపులకు నోచుకోలేదు. అయితే ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే తన భార్య తల్లితో కలిసి తారక్ తన మేనత్త కుటుంబ సభ్యులను పరామర్శించారు.