Venkaiah Naidu : ఒకప్పటి రాజకీయాలతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయాలు చాలా మారిపోయాయి. ఒకప్పుడు విమర్శలు చేసుకున్నా చాలా హుందాగా చేసేవారు. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో దిగజారుడు తనం అలానే వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే ఒకపార్టీ గురించి వకాల్తా పుచ్చుకుని మాట్లాడిన నాయకులు తెల్లారే సరికల్లా మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఒక సిద్ధాంతం అని లేకుండా అవకాశం వద్ద రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల వ్యవహార శైలి, మాట తీరు గురించి మాజీ ఉప రాష్ట్రపతి వెకయ్య నాయుడు గారు తీవ్రంగా విమర్శించారు.
డైపర్లు మార్చినట్లు మారుస్తున్నారు…
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేసారు. ఇపుడున్న రాజకీయ నాయకులు విలువలు లేమి రాజకీయం చేస్తునానరంటూ విమర్శించారు. డైపర్లు పదే పదే చిన్నపిల్లలకు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని అవకాశ వాద రాజకీయం చేస్తున్నారంటూ తెలిపారు. ఒక పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చాక చివరి దాకా అదే పార్టీలో ఉండాలంటూ తెలిపారు.
ఒకవేళ పార్టీ సిద్ధాంతాలు నచ్చక పోతే మారవచ్చు కానీ, పదవిలో ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి వెళ్లాలి అంతేకానీ పదవి ఉన్నట్లుగానే పార్టీ మారడం విలువలు లేని రాజకీయం అంటూ తెలిపారు. అదీ కాక భాష చాలా ముఖ్యమని, విమర్శలు చేసినా రాజకీయంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదంటూ చెప్పారు. అందుకే ప్రస్తుతం రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం విశ్వాసం రెండూ లేవని చెప్పారు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…