“పవన్ రాజాకీయాలలో ఉండడు.. ఆయన జాతకమే అంత..” సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన కామెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరమని.. మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో మంటలు రగిలించాయి. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వేణు స్వామిపై మండి పడుతున్నారు.

ఇక.. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా కూడా.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాను.

అలాగే జ‌రిగింది.. అని ఆయ‌న తెలిపారు. అవ‌న్నీ అచ్చం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే జ‌ర‌గ‌డం విశేషం. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణుస్వామి.

ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు.. మూడు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే జగనే ఉంటారని జోస్యం చెప్పాడు. ఒక వేళ జగన్ ను టార్గెట్ చేయాలంటే.. 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలన్నారు. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 2019 లో జగన్ కు జాతకపరంగా మంచి స్టార్ట్ కాగా.. అది 2020 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుందన్నారు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.