Vijayshanti: మహిళలను ఎందుకు దెయ్యాలుగా చూపిస్తారు… విజయశాంతి కామెంట్స్ వైరల్!

Vijayshanti: సీనియర్ నటి విజయశాంతి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం పరిమిత సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అభిమానులను సందడి చేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయశాంతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయా. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ అభిమాని విజయశాంతిని ప్రశ్నిస్తూ మగవాళ్ళు తీసే ప్రతి సినిమాలో మహిళలను ఎందుకు దెయ్యాలుగా చూపిస్తారనీ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు విజయ శాంతి సమాధానం చెబుతూ మన పురాణాలలో మగవాళ్ళు కూడా రాక్షసులుగా ఉంటారని మనం అడగవచ్చు. మగవాళ్ళు తీసే సినిమాలో అడవాళ్ళను దెయ్యాలుగా చూపిస్తున్నారు. ఆడవాళ్లు తీసే సినిమాలలో మగవాళ్ళును కూడా దెయ్యాలుగా చూపించవచ్చు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈమె ఈ విషయాన్ని చాలా సరదాగా చెప్పానని కేవలం మహిళా అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పానని తెలియ చేశారు.అయితే విజయ శాంతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల పై పలువురు స్పందించి పాజిటివ్ కామెంట్స్ చేయగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

Vijayshanti రాజకీయాలలో బిజీగా ఉన్న రాములమ్మ..

ఇకపోతే ఈమె రీ ఎంట్రీ అనంతరం మహేష్ బాబు సినిమాలో మాత్రమే నటించారు. అయితే ఈమె అభిమానులు మాత్రం సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. ఈమె సినిమాలలోకి వస్తే భారీగానే రెమ్యూనరేషన్ చెల్లించి సినిమాలలో తీసుకోవడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్న ఈమె మాత్రం సినిమాల గురించి పెద్దగా ఆసక్తి లేరని తెలుస్తుంది. ప్రస్తుతం రాజకీయాలలో విజయశాంతి ఎంతో బిజీగా ఉన్నారు.