Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి కూడా పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా కేరవాన్ కల్చర్ గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అవుట్ డోర్ షూటింగ్ అంటే తప్పనిసరిగా హీరో హీరోయిన్లకు క్యారవాన్ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక మరికొందరు స్టార్ హీరోలైతే వారి సొంత కేరవాన్ లను తీసుకెళ్తుంటారు.ఒకానొక సమయంలో చిత్ర బృందానికి ఈ విధమైనటువంటి సౌకర్యాలు లేకపోవడంతో షూటింగ్ సమయంలో ఇబ్బంది పడినప్పటికీ చిత్ర బృందం మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం క్యారవాన్స్ రావడం వల్ల సెలబ్రిటీలు వారి షాట్ పూర్తి కాగానే వెళ్లి కేరవాన్ లో రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కల్చర్ వల్ల నిర్మాతలు ఎంతగానో నష్టపోతున్నారని ఈయన వెల్లడించారు. హీరో లేదా హీరోయిన్లు ఒక షాట్ పూర్తి కాగానే వెళ్లి కారవాన్ లో రిలాక్స్ అవుతున్నారు.
తిరిగి షాట్ రెడీ అవ్వగానే ముందుగా వారి అసిస్టెంట్లను పిలిచి హీరో హీరోయిన్లకు కబురు పంపాలి. వారు వెళ్లి చెప్పిన అనంతరం హీరోలు లొకేషన్ లోకి వస్తారు. అప్పటికే దాదాపు 15 నిమిషాల సమయం వృధా అవుతుంది.అదేవిధంగా ఈ కారవాన్స్ రావడం వల్ల నిర్మాతలకు నష్టం రావడమే కాకుండా హీరో హీరోయిన్లకు డిసిప్లేన్ కూడా తగ్గిపోయింది అంటూ దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…