Pushpa Movie: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.
ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కు కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక పుష్ప సినిమా చూసిన ఎంతోమంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా సీనియర్ నటి విజయలక్ష్మి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయలక్ష్మి తన బాల్యం గురించి తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తనని ఎప్పుడు కోడలా కోడలా అంటూ పిలిచేవారని ఈమె అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమా ఏది అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ పుష్ప సినిమా చూశానని తెలిపారు. మరి అందులో నటించిన హీరో ఎవరు అని ప్రశ్నించగా సినిమా చూశాను కానీ అందులో ఉన్న హీరో ఎవరో నాకు తెలియదు అంటూ ఈమె వెల్లడించారు.అయితే ఇలా విజయలక్ష్మి సమాధానం చెప్పడంతో పుష్ప సినిమాలో నటించింది మరి ఎవరో కాదు మీ సినిమాలలో మీ సహనటుడిగా నటించిన అల్లు రామలింగయ్య గారి మనవడు అంటూ అని చెప్పుకొచ్చారు.ఈ మాటలు విన్న అనంతరం విజయలక్ష్మి ఈ మధ్యకాలంలో ఏ హీరోలు చూసిన రామానాయుడు మనవడు నాగేశ్వరరావు మనవడు ఎన్టీఆర్ మనవడు అంటూ చెబుతున్నారని విజయలక్ష్మి సమాధానం చెప్పారు.అయితే అల్లు అర్జున్ గురించి తన సినిమా గురించి విజయలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…