Chandra Mohan : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు చంద్ర మోహన్. 1966 వ సంవత్సరంలో ‘రంగులరాట్నం’ సినిమాతో ఈయన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 932 సినిమాల్లో నటించారు. అయితే ఇందులో 175 సినిమాల్లో హీరోగా నటించారు చంద్ర మోహన్. హీరోగా, కారెక్టర్ ఆర్టిస్తుగా, హాస్య నటుడుగా ఇలా చాలా విభిన్న పాత్రలను పోషించారు. అంతేకాదు ఈయనతో హీరోయిన్ గా మొదటి సినిమా చేస్తే తమ కెరీర్ లో ఉన్నత స్థాయి చేరుకుంటారు అన్నది కూడా వుంది. సిరిసిరిమువ్వ సినిమాతో జయప్రద, పదహారేళ్ల వయసు సినిమాతో శ్రీదేవి టాప్ హీరోయినలుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇప్పటి తరం హీరోలతో కూడా నటిస్తూ, కెరీర్ లో తనని తాను అప్డేట్ చేసుకుంటూ అభిమానులను అల్లరిస్తున్నాడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా కేకుండా అన్ని సినిమాలలోనూ నటిస్తూ తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో వున్న ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. ఇక అభిమానులలో మంచి పేరున్న వారి సంగతి చెప్పక్కరలేదు. కానీ చంద్రమోహన్ తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర మోహన్ గారు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
భానుమతి గారు కూడా చాలా సార్లు అడిగారు…
పిల్లల ఇండస్ట్రీ పరిచయం గురించి చంద్ర మోహన్ ఇలా చెప్పారు.. తనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరూ బాగుంటారు, ఇంకా చిన్న అమ్మాయి చాలా బాగుంటుంది. వీళ్ళని చిన్నప్పుడు భానుమతి గారు చూసి పిల్లలు బాగున్నారు చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేద్దాం అని అడిగినా సున్నితంగా తిరస్కరించాను. నాకు పిల్లలతో గడిపే సమయం కూడా ఉండేది కాదు. వాళ్ళు లేవకముందే షూటింగ్ కి వెళ్ళిపోయేవాడిని, నా భార్య పిల్లలను ఎపుడైనా షూటింగ్ కి తీసుకువచ్చేది, వాళ్ళు నన్ను గుర్తు పట్టే వాళ్ళు కాదు. ఒకసారి వారికి సినిమా రుచి చూపిస్తే మళ్ళి షూటింగ్ ఎపుడు అని అడుగుతారని భయం. సినిమా ప్రభావం వారిమీద పడకుండా ఇద్దరినీ పెంచాలి అనుకున్నాం, అలాగే పెంచామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇద్దరూ బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అన్న ఆలోచన మాత్రమే వుంది అని ఆయన చెప్పారు.
మానవ జీవితంలో మరణం అనివార్యమైన ఘట్టం. ఈ సందర్భాల్లో మృతదేహాన్ని మోయడం అనేది సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు…
ప్రతిరోజూ భక్తితో పూజలు చేస్తున్నా జీవితంలో ఆశించిన మార్పులు కనిపించకపోవడం చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది. దీని వెనుక కారణాలు…
తీపి పదార్థాలు తిన్న వెంటనే మనకు ఉత్సాహం పెరిగినట్లు అనిపించడం సహజం. చాక్లెట్, స్వీట్లు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంలో…
ప్రకృతిలో లభించే పండ్లలో కొన్నివి చూసేందుకు విచిత్రంగా కనిపించినా, వాటి లోపల దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.…
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సంకేతాలు కనిపిస్తాయని అనుకుంటాం. అయితే కొన్ని వ్యాధులు ఎలాంటి స్పష్టమైన…
వేసవి కాలంలో లభించే అరుదైన పండ్లలో పాల పండు ఒకటి. చాలా మందికి ఈ పండు గురించి పెద్దగా తెలియకపోయినా,…