Pokuri Baburao : ఒంగోలు లోని సి.ఎస్.ఆర్ శర్మ కాలేజీలో పోకూరి బాబురావు డిగ్రీ బీ.కాం చేసాడు. అక్కడ అతని క్లాస్ మేట్ టి.కృష్ణ. అతను ఎక్కువగా పాటలు బాగా పాడటం మూలాన కృష్ణకు అతనంటే అభిమానం ఏర్పడింది. కాలేజీ వార్షికోత్సవంలో, వీడ్కోలు సభలలో నాటకాలు వేసేవారు. ఈ నాటకాలకు కృష్ణ దర్శకత్వం వహించేవాడు. బాబూరావు “సంభవామి యుగే యుగే” నాటకంలో చిన్న పాత్ర వేసాడు.
మాదాల రంగారావు ప్రారంభించిన యువతరం కదిలింది సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో అతను కృష్ణతో పాటు పాల్గొన్నాడు. వాళ్ళిద్దరూ చిన్న వేషాలు వేసేవారు. పోకూరి బాబురావు బ్యాంకు ఉద్యోగానికి సెలవులు పెట్టి ఇవన్నీ చేసేవాడు. డబ్బింగ్, ఎడిటింగ్ కోసం మద్రాసు వెళ్ళి ఆయా దశలను పరిశీలించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే పోకూరి బాబురావు ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టి కృష్ణ సహాయ దర్శకునిగా పని చేస్తూ.. దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాపు దర్శకత్వంలో 1978లో విడుదలైన మన ఊరి పాండవులు చిత్రం మద్రాసులో ఒక థియేటర్లో ఆడుతుంటే నేను, టి కృష్ణ కలిసి ఆ సినిమాకి వెళ్ళాం.
అక్కడ నేను టి కృష్ణతో సినిమా చూస్తున్నప్పుడు.. ఎర్రటి కళ్ళు, చాకు లాంటి నడక, చురుకుగా కనిపించే ఓ కుర్రాడు తరచూ ఆ సినిమాలో సైకిల్ పై వెళుతూ మధ్యలో సైకిల్ స్టాండ్ వేస్తూ సంభాషణలు చెబుతూ ఉంటాడు. ఆయనను టి కృష్ణ గుర్తుపట్టారు. ఇతన్ని ఎక్కడో చూశాను. ఒంగోలులో మనం సి ఎస్ ఆర్ శర్మ కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ అబ్బాయి లాగానే ఒకతను సైకిల్ పై వస్తూ సైకిల్ స్టాండ్ లో సైకిల్ పెట్టి క్లాసులోకి వచ్చేవాడని నీకు గుర్తుందా అంటూ నన్ను టీ కృష్ణ అడిగారు. కానీ నాకు ఎంతకు అతనెవరో గుర్తుకు రాలేదు. ఆ తర్వాత ఓ సినీ పత్రికలో చిరంజీవి ఇంటర్వ్యూ వచ్చింది.
అప్పుడు ఆయన సి ఎస్ ఆర్ శర్మ కాలేజీలో చదువుకున్నానని చెప్పారు. అప్పుడు దర్శకుడు టీ కృష్ణ చెప్పింది నిజమే అనుకున్నాను. అయితే విషయం ఏమంటే.. ఆ తర్వాత టి కృష్ణ ఒక కథ అనుకున్నారు. అది నాకు వినిపించి, ఆ కథకు స్త్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాయడం మొదలుపెట్టారు. అయితే ఆ కథకి ఎవరు హీరో అయితే బాగుంటుందన్న క్రమంలో చిరంజీవి మా ఆలోచనకు తట్టారు. కథ సంభాషణలు రాసుకునే సరికి చాలా సమయం పట్టింది. ఆలోపే చిరంజీవి ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక మేము అతనితో సినిమా రూపొందించాలనుకునే లోపే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగారు.ఆ క్రమంలో ఆ కథను కాదనుకొని మళ్లీ లేడీ ఓరియంటెడ్ కథతో విజయశాంతి ప్రధాన పాత్రలో నేటి భారతం చిత్రాన్ని రూపొందించమని ఆ ఇంటర్వ్యూలో పోకూరి బాబురావు చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…