అలాంటి చిత్రాలలో నటిస్తామంటే అస్సలు కుదరదు: నటి రాశీ ఖన్నా

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా
రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం “ఊహలు గుసగుసలాడే”.ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తక్కువైనప్పటికీ తమిళంలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా నాగచైతన్య సరసన “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ సందర్భంలో రాశీ ఖన్నా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఏవిధంగా ఉండాలనే విషయాలను గురించి వెల్లడించారు. ఎప్పుడు ఓకే పంథాలో  కొనసాగాలంటే ఇండస్ట్రీలో కుదరదు.. ఇండస్ట్రీలో అనుభవం పెరిగే కొద్దీ కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలని ఈ బ్యూటీ చెబుతోంది. కెరియర్ మొదట్లో ప్రతి ఒక్క హీరోయిన్ గ్లామరస్ పాత్రల ద్వారా లేదా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అయితే ఎప్పుడు ఇలాగే ఇండస్ట్రీలో కొనసాగుతున్న అంటే కుదరదు.

ఇండస్ట్రీలో ఓ దశకు వచ్చాక కచ్చితంగా వేర్వేరు దారులలో ప్రయాణించాల్సి ఉంటుంది.ఈ విధంగా నటనా ప్రాధాన్యత గ్లామరస్ పాత్రలను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇండస్ట్రీలో కొంత కాలం పాటు నిలవగలము ఎప్పుడైతే మనలో విభిన్నమైన ప్రత్యేకతలు ఉంటాయో అప్పుడే మనకు అవకాశాలు కూడా వస్తాయని ఎప్పుడు కమర్షియల్ చిత్రాలలోనే నటిస్తానంటే అస్సలు కుదరదంటూ ఈ సందర్భంగా
రాశీ ఖన్నా తెలిపారు.