Movie News

Actor Naresh: మరోసారి సైబర్ పోలీసులను ఆశ్రయించిన నరేష్…. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నరేష్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ తరచూ తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా మూడు వివాహాలు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం మరొక నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు అయితే ఈ విషయం గురించి తరచూ నరేష్ వార్తల్లో ఉండడమే కాకుండా వీరి రిలేషన్ పై ఎంతోమంది పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ఎన్నో రకాల ట్రోల్స్ మీమ్స్ రావడమే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ మీడియా సంస్థలు కూడా వీరి వ్యక్తిగత జీవితం గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ వార్తలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై రియాక్ట్ అయినటువంటి నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నటువంటి సదరు చానల్ పై ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఈయన ఫిర్యాదు చేయడంతో ఎంతవరకు విచారణకు వచ్చాయనే విషయం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అనంతరం నరేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actor Naresh: పరువు నష్టం దావా వేస్తా….

కొందరు ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత విషయాల గురించి దుష్ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఇలా తను పరువు ప్రతిష్టలను ఇలా కించపరిచేలాగా ప్రవర్తించిన వారిని సాక్షాదారాలతో సహా బయట పెడతానని, వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి అలాగని మా బెడ్ రూమ్ బాత్రూంలోఇలా మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నారు అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఈయన ట్రోలర్స్ మీమర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

6 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

8 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago