Actor Naresh: మరోసారి సైబర్ పోలీసులను ఆశ్రయించిన నరేష్…. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నరేష్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ తరచూ తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా మూడు వివాహాలు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం మరొక నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు అయితే ఈ విషయం గురించి తరచూ నరేష్ వార్తల్లో ఉండడమే కాకుండా వీరి రిలేషన్ పై ఎంతోమంది పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ఎన్నో రకాల ట్రోల్స్ మీమ్స్ రావడమే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ మీడియా సంస్థలు కూడా వీరి వ్యక్తిగత జీవితం గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ వార్తలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై రియాక్ట్ అయినటువంటి నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నటువంటి సదరు చానల్ పై ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఈయన ఫిర్యాదు చేయడంతో ఎంతవరకు విచారణకు వచ్చాయనే విషయం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అనంతరం నరేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actor Naresh: పరువు నష్టం దావా వేస్తా….

కొందరు ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత విషయాల గురించి దుష్ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఇలా తను పరువు ప్రతిష్టలను ఇలా కించపరిచేలాగా ప్రవర్తించిన వారిని సాక్షాదారాలతో సహా బయట పెడతానని, వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి అలాగని మా బెడ్ రూమ్ బాత్రూంలోఇలా మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నారు అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఈయన ట్రోలర్స్ మీమర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.