ఎంతోమంది యువకులు తమ సరదాల కోసం వారి నిండు ప్రాణాలను బలి తీసుకుంటారు. ఎంతోమంది యువకులు చిన్నచిన్న పందేలను కాస్తూ వారి ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. ఇలాంటి తరుణంలోనే గత కొంత కాలం క్రితం హైదరాబాద్ నగర శివారులో కొంతమంది యువకులు ఎంతో ప్రమాదకరమైన బైక్ విన్యాసాలు చేస్తూ, స్థానికులలో కొంత అలజడి సృష్టించేవారు. తరువాత కొంతకాలం పాటు ఆపినప్పటికీ ప్రస్తుతం ఇలాంటి బైక్ విన్యాసాలను మరి మొదలుపెట్టారు.
అప్పుడు నగర శివారులో విన్యాసాలను చేసే యువకులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ప్రధాన కూడళ్లలో అర్థరాత్రి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు.
మెహిదీపట్నం- టోలిచౌకీ మార్గంలోని రేతిబౌలి కూడలి వద్ద కొంతమంది యువకులు ఇలాంటి విన్యాసాలను చేస్తూ కనిపించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఉండే బైక్ రేసర్లు.. రెడ్ సిగ్నల్ పోయి ఆరెంజ్ సిగ్నల్స్ పడగానే అవతలివైపుకు వెళ్లాలి. తిరిగే గ్రీన్ సిగ్నల్స్ పడెలోపు ఇటు వైపుకు రావాలి. అయితే ఇదంతా కేవలం 5 సెకన్ల కాలంలో చేయాలన్నది పందెం.
ఈ ప్రమాదకరమైన పందెంలో గెలిచిన విజేతలకు బహుమతి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తారు. కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే బహుమతి కోసం ఎంతో ప్రమాదకరమైన విన్యాసాలను చేయడంతో వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడటం కాకుండా, ఇతరుల ప్రాణాలు కూడా ఎంతో ప్రమాదకరంగా మారవచ్చు. కేవలం1000 రూపాయల పందెం కోసం ఇంతటి ప్రమాదకరమైన విన్యాసాలలో పాల్గొనడం ఎంతో ప్రమాదకరమైనప్పటికీ కూడా కొందరు యువకులు నగరం నడిబొడ్డులో ఈ విధంగా బైక్ విన్యాసాలు చేయటంతో తోటి ప్రయాణికులు ఎంతో భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…