Akhanda Sequel: అఖండ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి… సంతోషంలో నందమూరి ఫ్యాన్స్!

Akhanda Sequel: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటేనే నందమూరి అభిమానులకు పూనకాలు వస్తాయని చెప్పాలి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి. అలాంటిది మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలియడంతో నందమూరి అభిమానుల సంతోషానికి అవధులు లేవు.

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో చివరిగా వచ్చిన చిత్రం అఖండ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిన మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించారు.ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలు పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందించారు.

తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి స్కంద సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలయ్య కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఖండ సీక్వెల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Akhanda Sequel:

ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ ప్రస్తుతం తాను స్కంద హడావిడిలో ఉన్నానని ఈ హడావిడి కాస్త పూర్తి కాగానే అఖండ సినిమా పనులు మొదలవుతాయని తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్లానింగ్స్ జరుగుతున్నాయని త్వరలోనే వీటన్నింటిని అధికారికంగా తెలియజేస్తామని బోయపాటి తెలిపారు.ఇలా బోయపాటి చేసిన ఈ వ్యాఖ్యలు విన్నటువంటి బాలయ్య అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మాటలు బట్టి చూస్తే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తుంది.