Analyst Damu Balaji : తెలుగు వారు దేశ, విదేశాల్లో స్థిరపడిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా కలిసి ఉండాలని ఎవరికి వారు సంఘాలను పెట్టుకుని అక్కడ ఉన్న తెలుగువారికి సహాయపడే ఉద్దేశంతో గ్రూప్ ఏర్పడ్డారు. అలా ఏర్పడిన సంఘమే తానా. తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా. ఇది 1978లోనే ఏర్పడింది. స్థానికంగా ఉన్న తెలుగు వారికి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. అయితే ఎక్కువగా ఒక కులానికి చెందిన వారు ఉండటం వల్ల ఈ సంస్థ ఆ కులానికి సంబంధించినది అనే మాటలు వినిపిస్తాయి అంటూ అనలిస్ట్ బాలాజీ తెలిపారు. తాజాగా ఈ తానా సంఘం ప్రతి ఏడాది నిర్వహించినట్లుగా సభలు నిర్వహించగా అందులో రెండు వర్గాలవారు ముష్టి యుద్దానికి దిగారు. ఈ ఇష్యూకి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవడంతో ఆ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
జాతి పరువు తీస్తున్నారు…
ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే దానిగురించి స్పందించడానికి కొంతమంది సెలబ్రిటీలు రెడీగా ఉంటారు. అలా నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ ద్వారా పోస్ట్లు పెడుతూ ఇష్యూ గురించి తన అభిప్రాయాలను చెబుతుంటారు. తాజాగా జరిగిన తానా సభలో గొడవ గురించి కూడా బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. జాతి పరువు నాశనం చేసారు అని అన్నారు. ఇక ఈ విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ తానా సభలలో మొదటి నుండి కమ్మ కులం డామినేషన్ ఉంది.
తాజాగా గొడవ కూడా టీడీపీ పార్టీ లోని రెండు వర్గాల మధ్య జరిగింది. సభలో భోజనాలు అయ్యాక కొందరు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం అలా చేయొద్దని లోకేష్ వర్గం అనడం, మాటా మాటా పెరిగి కొట్టుకోవడం జరిగిందని బాలాజీ చెప్పారు. అయితే ఈ ఇష్యూ చాలా చిన్నదే అయినా బండ్ల ట్వీట్ తో పెద్దది గా చేస్తున్నాడు, టీడీపీ లో రెండు వర్గాల పోరు మాత్రమే అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…