Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసిన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో సిట్ విచారణ సరిగా లేదని వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ కు కేసును సిబిఐకి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరిని ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో అసలు కథ ఏమిటి అన్నది అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
సెటిల్మెంట్ లోనే గొడవ అందుకే హత్య…
వివేకానంద రెడ్డి గారు ఆయన ఇంట్లోనే మరణించారు. మర్చి 15, 2019 ఎన్నికల కు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఉదంతంలో వివేకానంద రెడ్డి గారిది హత్య లేక సహజ మరణమా అన్నది మొదట్లో గంధరగోళంగా ఉన్న రాను రాను అది హత్య అన్నది తెలిసింది. అయితే హత్య టీడీపీ పార్టీ వారు చేయించారు అనే వైసీపీ ఆరోపణల నడుమ చివరికి హత్య కేసు తాజాగా ఎంపి అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుందంటూ అనలిస్ట్ బాలాజీ గారు అభిప్రాయపడ్డారు. కేసులో నిందితుడైన దస్తగిరి అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్ములం ప్రకారం బెంగళూరు లోని ఒక ఆస్తి విషయంలో సెటిల్మెంట్ చేయడం వల్ల వివేకానంద రెడ్డి గారికి 8 కోట్లు రాగా ఆ వాటా ఇవ్వకుండా ఉండటంతొ గొడవ జరిగి ఆయనను చంపాలనే ప్లాన్ చేసారు.
అలా అవినాష్ రెడ్డి గారి నెత్రుత్వంలో దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, వివేకాను చంపడానికి ప్లాన్ చేసారు. అలా మార్చి 15 అర్ధరాత్రి వివేకానంద రెడ్డి గారితోనే ఇంటికి వెళ్ళాడు దస్తగిరి, ఇక మిగిలిన వారు ఇంటి వెనుక గోడ దూకి లోపలికి వచ్చారు. లోపలికి వెళ్ళాక ఆయనను తెచ్చుకున్న కత్తితొ నరికి చంపేశారు. ఇదంతా అవినాష్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని దస్తగిరి ఇచ్చిన వాంగ్ములం లో ఉంది. ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉన్న రోజుకో కొత్త కథ తెర మీదకు తీస్తున్నారంటు బాలాజీ అభిప్రాయాపడ్డారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…