Auto Ram Prasad : జబర్దస్త్ ముందులా లేదు మసకబారింది. జబర్దస్త్ నుండి ఎంతో మంది కమెడియన్స్ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక జడ్జిలుగా నాగబాబు , రోజాలకు కూడా జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. అలాంటి జబర్దస్త్ నాగబాబు వీడిపోయారు వేరు కుంపటి పెట్టుకున్నారు కొంతమంది కమెడియన్స్ జబర్దస్త్ నుండి తీసుకెళ్లి మరో ఛానల్ లో సేమ్ కాన్సెప్ట్ తో షో రన్ చేసారు అయినా జబర్దస్త్ కు నష్టం రాలేదు.
అయితే కొన్నిరోజులుగా జబర్దస్త్ లో మెయిన్ కమెడియన్స్ వెళ్లిపోవడంతో షో కళ తగ్గిందనే చెప్పాలి . అటు జడ్జిగా వ్యవహరించిన రోజా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ఇక జబర్దస్త్ నుండి హైపర్ ఆది కూడా వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆది కొద్దిరోజులుగా షోలో కనిపించడం లేదు. ఇక షోలో మెయిన్ పిల్లర్స్ ఆది, సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు కనిపించడం లేదు. సుధీర్ కూడా జబర్దస్త్ ను వదిలేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
వాళ్ళు లేకుండా జబర్దస్త్ లో నీ ప్రయాణం ఎలా అనిపిస్తోంది…..
ఇక ఈ వారం జబర్దస్త్ ప్రోమోలో అనిల్ రావిపూడి, శ్రద్ధ దాస్ వచ్చి సందడి చేసారు. ఇక షో లో అనిల్ రావిపూడి, ఆటో రామ్ ప్రసాద్ ను నువ్వు ఆటో కదా మరీ నీ వీల్స్ లేకుండా ప్రయాణం ఎలా ఉంది అని ప్రశ్న వేసాడు. దీనికి రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళతో ఉంటే స్కిట్ లో ఈ డైలాగ్ నీది ఈ డైలాగు నీది అంటూ చెప్పేస్తే సరిపోతుంది మా మాధ్య ఆ మ్యాజిక్ ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. సుధీర్ గెటప్ శ్రీను అసలు జబర్దస్త్ నుండి వెళ్లిపోయారో లేదో తెలీదు కానీ వారి కెరీర్ పరంగా ఈ ముగ్గురు స్నేహితులు వేరుగా ఉండొచ్చు కానీ వారి మధ్య స్నేహం కాదు. ఇక వారి కెరీర్ కోసం వేరే అవకాశాలను ఎంచుకోవడం తప్పైతే కాదు కదా అలాగని జబర్దస్త్ వీడినందుకు వారిని విమర్శించడం తగదు.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…