Madhavi Latha : సినిమాలలో నటించే నటీనటులు సినిమాలలో అవకాశం వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు చేరువగా ఉంటారు. అభిమానులకి ఎప్పుడూ చేరువలో ఉండడానికి వారికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. కాకపోతే నటీనటులు సోషల్ మీడియా ద్వారా ఏదైనా పోస్ట్ చేసిన, కొంతమంది నెటిజెన్ ల నుంచి విచిత్రమైన కామెంట్ లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనను నటి మాధవీ లత ఎదుర్కొంది.
మాధవీ లత, తనీష్ హీరోగా రవిబాబు దర్శకత్వం లో వచ్చిన నచ్చావులే సినిమాతో తెలుగు సినిమాల్లో కి అడుగు పెట్టింది. తరువాత స్నేహితుడా సినిమాతో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం చలన చిత్ర రంగానికి దూరంగా వున్నా సోషల్ మీడియా లో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. అయితే మాధవి ఏపీ రాజకీయలలోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మాధవి పెట్టిన ఒక పోస్ట్ కు నెటిజెన్ పెట్టిన కామెంట్, దానికి మాధవి చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా వుంది.
నిన్ను హౌలే, గూట్లే అని తిట్టాలనుంది కానీ అలా చేయను…
నేటిజన్స్ చేసే తప్పుడు కామెంట్లకు ఘాటుగా స్పందించే మాధవి తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసింది. ఇటీవల మాధవీ లత బెజవాడ దుర్గమ్మ దర్శనం చేసుకుంది. అమ్మవారి బంగారు వాకిలి దర్శనం చాలా బాగా జరిగిందని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన ఒక నెటిజన్ కొంచం విచిత్రంగా కామెంట్ చేశాడు. అక్కా అంటూనే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని, నువ్వంటే చాలా ఇష్టం అక్కా, పెళ్లి చేసుకుందామా? అని అన్నాడు.
నెటిజెన్ చేసిన ఈ కామెంట్ కు మాధవి లత కూడా తనదైన రీతిలో స్పందించింది అక్కని పెళ్లి చేసుకుంటావా.. హౌలే, గూట్లే అని అనాలని ఉంది కాని అనను అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…