Baby cinema director Sai Rajesh : ప్రస్తుతం యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పిస్తున్న సినిమా బేబీ. కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు అందరిస్తారు అనే విషయం ఈ సినిమాతో మరోసారి రుజువయింది. తెలుగు ఆడియన్స్ ఈ మధ్యా కాలంలో కథా బలం ఉండే సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారన్నది ఈ సినిమా మరోసారి నిరూపించింది. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటనకు ప్రశంసలు అందుకుంటుండగా వారితో ఒక కథను చక్కగా చెప్పగలిగిన డైరెక్టర్ సాయి రాజేష్ ను మెచ్చుకుంటున్నారు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సినిమాలో ఆ డైలాగ్ కు క్షమాపణ చెబుతా…
సినిమా యూత్ కే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో ముఖ్యంగా వైష్ణవి చైతన్య క్యారెక్టర్ మీద చాలా మంది కోపం తెచ్చుకునేలా ఆమె పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే కొన్ని సన్నివేశాల్లో మాట్లాడే బూతులు అది కూడా అమ్మాయిలు మాట్లాడే బూతుల గురించి డైరెక్టర్ వివరిస్తూ ఆ సన్నివేశంకు అవసరం అనుకున్నా కనుకే అక్కడ అలాంటి బూతు ఉపయోగించాం.
ఒక్క చోట మాత్రం తెరవాల్సింది కళ్ళు కాదు కాళ్ళు అనే డైలాగ్ వాడకుండా ఉండాల్సింది అనిపించింది. అందుకు క్షమాపణ అడుగుతున్నాను అంటూ డైరెక్టర్ వివరించారు. మిగిలిన చోట్ల కొన్ని అభ్యంతరకర పదాలను సన్నివేశంలో భాగంగా వాడాము అంటూ చెప్పారు. సినిమాకు ఇంత కలెక్షన్ వస్తే చాలు అనుకుంటే ఇప్పటికీ హౌస్ ఫుల్ ఆడుతోంది. సోమవారం అందరూ ఆఫీస్ లకు పోతారు ఇక కలెక్షన్ తగ్గుతుంది అనుకున్నాం కానీ మా అంచనాలు తప్పయ్యాయి అంటూ డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…