Balakrishna: ఆస్కార్ వచ్చిన తీరు మార్చుకొని బాలయ్య… ఎక్కడ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదుగా?

Balakrishna: రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్ ఈ సినిమా గత ఏడాది విడుదలై అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది.

ఇందులోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నామినేషన్స్ లో నిలవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఇందుకు కారణం అయినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ దేశంలోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా ఒక తెలుగు సినిమా ఆస్కార్ అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఇంత గొప్ప అవార్డు రావడంతో ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు ఈ పాట ఆస్కార్ సాధించడానికి కారణమైనటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు.

Balakrishna: ఇద్దరి మధ్య మనస్పర్ధలే కారణమా…

ఇకపోతే నందమూరి వారసుడు ఎన్టీఆర్ నటించిన సినిమాకు ఇలాంటి గొప్ప అవార్డు రావడంతో నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు కాలర్ ఎగరేసే సమయం కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తుంది. అయితే ఈయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి లేఖలో ఈయన హీరోల పేర్లు ప్రస్తావించకపోవడం గమనార్హం. నందమూరి బిడ్డ ఎన్టీఆర్ నటించిన సినిమాకి గొప్ప అవార్డు రావడంతో సంతోషించాల్సిన బాలయ్య కనీసం తన పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడంతో ఆస్కార్ వంటి గొప్ప అవార్డు వచ్చిన బాలయ్య వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు.ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనడానికి ఇది కూడా నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు.