Balakrishna: రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్ ఈ సినిమా గత ఏడాది విడుదలై అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది.
ఇందులోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నామినేషన్స్ లో నిలవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఇందుకు కారణం అయినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ దేశంలోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా ఒక తెలుగు సినిమా ఆస్కార్ అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఇంత గొప్ప అవార్డు రావడంతో ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు ఈ పాట ఆస్కార్ సాధించడానికి కారణమైనటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే నందమూరి వారసుడు ఎన్టీఆర్ నటించిన సినిమాకు ఇలాంటి గొప్ప అవార్డు రావడంతో నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు కాలర్ ఎగరేసే సమయం కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తుంది. అయితే ఈయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి లేఖలో ఈయన హీరోల పేర్లు ప్రస్తావించకపోవడం గమనార్హం. నందమూరి బిడ్డ ఎన్టీఆర్ నటించిన సినిమాకి గొప్ప అవార్డు రావడంతో సంతోషించాల్సిన బాలయ్య కనీసం తన పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడంతో ఆస్కార్ వంటి గొప్ప అవార్డు వచ్చిన బాలయ్య వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు.ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనడానికి ఇది కూడా నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…