Star Producer: సాధారణంగా సినిమా చేసే నిర్మాతలు అందరూ కూడా తమ చేసిన సినిమాకు కాస్త లాభాలు రావాలని భావిస్తారు. ఇలా లాభాల కోసం దర్శక నిర్మాతలు కూడా భారీగానే కష్టపడుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం తమ సినిమాల విషయంలో కాస్త చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ లాభాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.ఇక ఒకప్పుడు పెద్ద సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఉండేది చిన్న సినిమాలను కనుక థియేటర్లో విడుదల చేయాలంటే నిర్మాతలకు తల ప్రాణం తోకకు వచ్చేది.
ఇలా చిన్న సినిమాల విషయంలో ఎంతో కంగారుగా ఉండే నిర్మాతలకు లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సరైన ప్లాట్ ఫామ్ గా మారిపోయాయి. ఇలా చిన్న సినిమాలను విడుదల చేయడానికి ఎలాంటి సమస్య లేకుండా పోయింది అయితే ఇప్పుడు మాత్రం పలు ఓటీటీ సంస్థలు చిన్న సినిమా హక్కులను కొనుగోలు చేయాలన్నా కూడా పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. సినిమా క్వాలిటీ బాగుంటేనే డబ్బు చెల్లించడానికి సిద్ధపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ నిర్మాత కేవలం 10 లక్షల రూపాయలతో చీప్ క్వాలిటీ కెమెరాలతో సినిమా చేసి నటీనటులకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా, తన సినిమాకు ఏకంగా 1.5 కోట్ల ఖర్చు అయిందని రెండు కోట్లకు తన సినిమాని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకీ పది లక్షలతో సినిమా చేసే రెండు కోట్ల డిమాండ్ చేస్తున్న నిర్మాత ఎవరు అనే విషయానికి వస్తే…
నిర్మాత పేరు ఎమ్.వై. మహర్షి. ఇతను తీసిన సినిమా ‘1948 – అఖండ భారత్’. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాని థియేటర్లలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్క రోజుకే ఈ సినిమా థియేటర్ల నుంచి తొలగించబడింది అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రెండు కోట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఈ సినిమా భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ డిమాండ్ చేయడంతో ఎవరు కూడా ముందుకురాలేదు అదే సమయంలో ఈయన ఈ చిత్ర బృందానికి డబ్బులు కూడా ఇవ్వలేదని తెలియడంతో ప్రతి ఒక్కరు ఈయన వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…