Star Producer: సాధారణంగా సినిమా చేసే నిర్మాతలు అందరూ కూడా తమ చేసిన సినిమాకు కాస్త లాభాలు రావాలని భావిస్తారు. ఇలా లాభాల కోసం దర్శక నిర్మాతలు కూడా భారీగానే కష్టపడుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం తమ సినిమాల విషయంలో కాస్త చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ లాభాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.ఇక ఒకప్పుడు పెద్ద సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఉండేది చిన్న సినిమాలను కనుక థియేటర్లో విడుదల చేయాలంటే నిర్మాతలకు తల ప్రాణం తోకకు వచ్చేది.
ఇలా చిన్న సినిమాల విషయంలో ఎంతో కంగారుగా ఉండే నిర్మాతలకు లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సరైన ప్లాట్ ఫామ్ గా మారిపోయాయి. ఇలా చిన్న సినిమాలను విడుదల చేయడానికి ఎలాంటి సమస్య లేకుండా పోయింది అయితే ఇప్పుడు మాత్రం పలు ఓటీటీ సంస్థలు చిన్న సినిమా హక్కులను కొనుగోలు చేయాలన్నా కూడా పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. సినిమా క్వాలిటీ బాగుంటేనే డబ్బు చెల్లించడానికి సిద్ధపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ నిర్మాత కేవలం 10 లక్షల రూపాయలతో చీప్ క్వాలిటీ కెమెరాలతో సినిమా చేసి నటీనటులకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా, తన సినిమాకు ఏకంగా 1.5 కోట్ల ఖర్చు అయిందని రెండు కోట్లకు తన సినిమాని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకీ పది లక్షలతో సినిమా చేసే రెండు కోట్ల డిమాండ్ చేస్తున్న నిర్మాత ఎవరు అనే విషయానికి వస్తే…
నిర్మాత పేరు ఎమ్.వై. మహర్షి. ఇతను తీసిన సినిమా ‘1948 – అఖండ భారత్’. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాని థియేటర్లలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్క రోజుకే ఈ సినిమా థియేటర్ల నుంచి తొలగించబడింది అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రెండు కోట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఈ సినిమా భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ డిమాండ్ చేయడంతో ఎవరు కూడా ముందుకురాలేదు అదే సమయంలో ఈయన ఈ చిత్ర బృందానికి డబ్బులు కూడా ఇవ్వలేదని తెలియడంతో ప్రతి ఒక్కరు ఈయన వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…