Perni Nani : ఏపీ రాజకీయాల్లో టీడీపీ మీద ఎంత ఎత్తున వైసీపీ నేతలు లేస్తారో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాత్రం వైసీపీ నేతల విసుర్లు బాగా ఉంటాయి. ఇంక పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినా లేక బహిరంగ సభ పెట్టినా ఆయన మాట్లాడిన విషయాలకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ లో కొంతంది లీడర్స్ రెడీగా ఉంటారు. అందులో ముందుండేది పేర్ని నాని. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని జనసేన అధినేత మీద బాగా ఫైర్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ మీద ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా అలా విమర్శలు చేయడమే పని అన్నట్లు చేసే పేర్ని నాని గారు అదే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురవగా ఆసక్తికర సమాధానం చెప్పారు.
వేడి చల్లారాక వడ్డీస్తే ఏం లాభం…
పవన్ కళ్యాణ్ ఏదైనా సభ పెట్టినా మీడియాతో మాట్లాడినా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలను ఎక్కుపెడతారు. ఇక పవన్ మాట్లాడింది అయ్యేలోపే వైసీపీ నుండి లీడర్స్ కౌంటర్ కు సిద్ధమై పోతారు. ఇక ఇదే విషయం గురించి పేర్ని నాని ని ప్రశ్నించగా పవన్ చెప్పే అపద్దాలను తిప్పికొట్టేందుకు వెంటనే మాట్లాడాల్సి వస్తుందని వివరించారు.
భోజనం వేడిగా వడ్డీస్తేనే రుచి ఉంటుంది అలాగే తాను మాట్లాడిన అసత్యాలకు వేడిగానే కౌంటర్లు వేస్తేనే బాగుంటుంది అంటూ వివరించారు. పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడితే నేను రెండు మెట్లు దిగి మాట్లాడాల్సి వస్తుంది. నేనెపుడూ నా జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడను అంటూ కానీ పవన్ కళ్యాణ్ మొదట నా గురించి విమర్శించాడు అందుకే నేను విమర్శించాల్సి వచ్చింది అంటూ చెప్పారు పేర్ని నాని.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…