Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వాచ్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఈయన ఎప్పుడు కూడా ఖరీదైన వాచ్ లను దరిస్తూ ఉంటారు. ఇలా వాచ్ ల కోసమే ఎన్టీఆర్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారనే విషయం కూడా మనకు తెలిసిందే.ఇకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ లో నిలిచి ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో చిత్ర బృందం గత పది రోజులుగా అమెరికాలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా ప్రతి కార్యక్రమానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్ లో అటెండ్ అవుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్నటువంటి చిత్ర బృందానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఆర్ చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఈ పార్టీలో భాగంగా ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు ముఖ్యంగా ఈయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంత అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంత అసలు అది ఏ బ్రాండ్ అనే విషయానికి వస్తే…
యంగ్ టైగర్ పెట్టుకున్న చేతి గడియారం Patek Phillipe Nautilus Travel Time (95990/1A-001 Stainless Steel) – దీని ధర అక్షరాలా రూ. 1 కోటి 56 లక్షల 13,155.. (190,000 డాలర్స్) ఇంత రేటు అంటే ఇక అందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయో అర్థం అవుతుంది ఏది ఏమైనా ఒక వాచ్ కోసం ఇలా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఎలా ఎన్టీఆర్ వాచ్ ధర తెలిసినటువంటి అభిమానులు ఒకింత షాక్ కి గురవుతున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…