చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన బాలయ్య ఫ్యాన్స్.. వారి దిష్టిబొమ్మలను తగలబెట్టాలంటూ పిలుపు..!

మీడియా ఎదుట ఆంధ్రప్రదేశ్ టిడిపి నేత చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శాసనసభలో వైఎస్ఆర్ సిపి నాయకులు చంద్రబాబు నాయుడు అతని భార్య దివంగత నేత ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరి పట్ల అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి పలువురు టీడీపీ నేతలు స్పందించారు. అదే విధంగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు చంద్రబాబునాయుడుకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ వైసిపి నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ఎన్.బి.కె  (balakrishna) ఫ్యాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ , బి.బి.జి తిలక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు ఏ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నారు యావత్ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారని ఇలాంటివారిని మనం ఎన్నుకున్నది అంటూ ఆంధ్ర ప్రజలు విస్తుపోతున్నారని తెలియజేశారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళకు జరిగిన అవమానం చరిత్రలో మాయని మచ్చగా నిలబడి పోతుందని వీరు వెల్లడించారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, కన్నబాబు, రోజా, చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టాలని బాలకృష్ణ
ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపోతే సినీ నిర్మాత అశ్వినీదత్ కూడా చంద్రబాబునాయుడు కుటుంబానికి మద్దతు తెలిపారు.