Featured

అసెంబ్లీ ఘటనపై స్పందించిన తారక్.. అరాచక పరిపాలనకు నాంది అంటూ షాకింగ్ కామెంట్స్..!

నిన్న అసెంబ్లీ లో వైఎస్ఆర్ సీపీ నాయకులు, టిడిపి నాయకుల మధ్య జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తన భార్యను అవమానించారని మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే నందమూరి బాలకృష్ణ స్పందించగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.అయితే తాను ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని ఒక దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని తెలియజేసిన ఎన్టీఆర్ స్త్రీలపట్ల పరుషంగా మాట్లాడటం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

మనదేశంలో స్త్రీలను గౌరవించడం సంస్కృతి అని ఈ అరాచక పరిపాలనను పక్కనపెట్టి సమస్యలపై పోరాడి రాబోయే తరానికి బంగారు బాట వేయాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అసెంబ్లీ ఘటన పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వ్యాఖ్యలకు పలువురు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలబడగా మరికొందరు ఆయన మాటలను వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఎన్నో అరాచకాలు జరిగాయని ఎంతో మంది మహిళా ఉద్యోగుల పై దాడులు కూడా జరిగాయని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్ చేంజ్‌లో చేయాల్సింది ఇదే!

వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…

58 minutes ago

బీపీ, షుగర్ మాత్రమే కాదు.. 40 తర్వాత ఈ టెస్టులు కూడా అవసరం!

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…

1 hour ago

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…

1 hour ago

అక్షయ తృతీయ స్పెషల్: వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు మిస్ అవొద్దు!

అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…

1 hour ago

పిల్లల్లో ఆటిజం సంకేతాలు ఇవేనా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…

1 hour ago

తిరుమల మాడ వీధుల రహస్యాలు.. ఈ ప్రదక్షిణకు అంతటి పవిత్రత ఎందుకు?

తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…

2 hours ago