మీడియా ఎదుట ఆంధ్రప్రదేశ్ టిడిపి నేత చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శాసనసభలో వైఎస్ఆర్ సిపి నాయకులు చంద్రబాబు నాయుడు అతని భార్య దివంగత నేత ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరి పట్ల అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి పలువురు టీడీపీ నేతలు స్పందించారు. అదే విధంగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు చంద్రబాబునాయుడుకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ వైసిపి నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ఎన్.బి.కె (balakrishna) ఫ్యాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ , బి.బి.జి తిలక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు ఏ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నారు యావత్ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారని ఇలాంటివారిని మనం ఎన్నుకున్నది అంటూ ఆంధ్ర ప్రజలు విస్తుపోతున్నారని తెలియజేశారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళకు జరిగిన అవమానం చరిత్రలో మాయని మచ్చగా నిలబడి పోతుందని వీరు వెల్లడించారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, కన్నబాబు, రోజా, చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టాలని బాలకృష్ణ
ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపోతే సినీ నిర్మాత అశ్వినీదత్ కూడా చంద్రబాబునాయుడు కుటుంబానికి మద్దతు తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…